మాటల వర్షమే!.. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
కొత్త మిత్రులు, సరికొత్త పొత్తులతో అధికార, విపక్ష కూటములు బలాన్ని కూడదీసుకుంటున్న తరుణంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.
అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న ఎన్డీయే, ఇండియా కూటములు
మణిపుర్ మారణకాండ, దిల్లీ ఆర్డినెన్సు, యూసీసీలపై దద్దరిల్లే అవకాశం!
అఖిలపక్ష సమావేశంలోనే కనిపించిన సంకేతాలు
ఈనాడు, దిల్లీ: కొత్త మిత్రులు, సరికొత్త పొత్తులతో అధికార, విపక్ష కూటములు బలాన్ని కూడదీసుకుంటున్న తరుణంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరస్పరం ఇరుకునపెట్టే వ్యూహాలకు రెండు శిబిరాలూ పదును పెడుతున్నాయి. ముఖ్యంగా మణిపుర్ అల్లర్లపై ప్రధాని నరేంద్రమోదీ ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ), దిల్లీ ఆర్డినెన్సు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, మహిళా రిజర్వేషన్లు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రైల్వే భద్రత, సరిహద్దులో పరిస్థితులు వంటి ఇతర అంశాలూ చర్చకు వచ్చేలా చూడాలని, దానిపై వ్యూహరచనకు ప్రతిరోజూ సమావేశం కావాలని ప్రతిపక్ష శిబిరం నిర్ణయించింది. ఆగస్టు 11 వరకు మొత్తం 17 పనిదినాల్లో కొనసాగే సమావేశాల్లో 32 అంశాలను సభల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. తొలిరోజు నుంచే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దిల్లీ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే సభ్యులు సమర్పించిన నోటీసులను లోక్సభ సచివాలయం అనుమతించింది. కొత్తగా ఏర్పాటైన విపక్ష కూటమి ‘ఇండియా’- గురువారం తొలిసారి సమావేశం కానుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని చర్చించడానికి రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో దీనిని నిర్వహించనున్నారు.
అఖిలపక్షంలో డిమాండ్లు వెల్లడి
ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. ఉభయసభలను సజావుగా నిర్వహించాలన్న ఉద్దేశంతో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం బుధవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. 34 పార్టీల నేతలు హాజరై తమ డిమాండ్లను వినిపించారు. మణిపుర్ పరిస్థితులపై మొదటిరోజే ప్రధానమంత్రి ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. కులగణన, ధరల పెరుగుదల, నిరుద్యోగంలాంటి అంశాలపై చర్చ గురించి వివిధ పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రతి అంశంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. మణిపుర్ అంశంపై చర్చకు సభాపతి ఎప్పుడు తేదీ నిర్ణయిస్తే అప్పుడు చర్చిస్తామని, ప్రధానమంత్రి ప్రకటన కోసం విపక్షాలు డిమాండ్ చేయడం సభలో గందరగోళం సృష్టించడానికి ఒక సాకు మాత్రమేనని చెప్పారు.
..ఆ ఆర్డినెన్సులను వ్యతిరేకిస్తాం: కాంగ్రెస్
పార్లమెంట్ సమావేశాల ప్రారంభ రోజే.. మణిపుర్ అంశంపై వాయిదా తీర్మానం ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. మణిపుర్లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు ఏం చేయాలనుకుంటున్నారన్నది పార్లమెంటు ద్వారా దేశ ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. చైనా దురాక్రమణకు పాల్పడుతున్నా ప్రధానమంత్రి ఆ దేశానికి క్లీన్చిట్ ఇస్తున్నారని విమర్శించారు. అటవీ సంరక్షణ సవరణ చట్టం, జీవవైవిధ్య బిల్లు, దిల్లీ ఆర్డినెన్స్లను వ్యతిరేకించబోతున్నట్లు వెల్లడించారు. సభ సజావుగా జరిగేలా చూసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. వాజ్పేయీ, మన్మోహన్సింగ్, పీవీ నరసింహారావు సర్కారుల్లో ఏ అంశంపైనైనా చర్చలు సాగేవని, ఏదీ ఏకపక్షంగా, నిరంకుశంగా ఉండేది కాదని వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని భారాస, వైకాపా కోరాయి. లోక్సభ స్పీకర్ ఓంబిర్లా బుధవారం లోక్సభాపక్ష నేతలతో సమావేశమై.. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు.
కొత్తపేరుతో ఒరిగేదేమీ లేదు: ప్రధాన్
విపక్ష కూటమి పాత వాసనలు వదులుకోకుండా కొత్తపేరు పెట్టుకున్నంతమాత్రాన మారేదేమీ ఉండదని భాజపా ఎద్దేవా చేసింది. దేశంపట్ల ఆలోచనతీరును, ఉద్దేశాలను మార్చుకుంటే మేలని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ సూచించారు. ఇండియా కూటమి పది తలల రావణుడితో సమానమని భాజపా పేర్కొంది. ముందుచూపుతో, నిర్ణయాత్మక అడుగులు వేసే సామర్థ్యం ఇంతమంది భాగస్వాములున్న కూటమికి ఉండదని ట్వీట్ చేసింది. ఆ కూటమి నేత ఎవరని ప్రశ్నించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ ఇంటి నుంచి వీడియో వెలుగులోకి.. ‘హిట్మ్యాన్’ అంటూ స్వాతీమాలీవాల్ పోస్టు
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసంలోనివిగా భావిస్తోన్న కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై స్వాతీమాలీవాల్ స్పందించారు. -
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్పై జరిగిన భౌతిక దాడి సిగ్గుచేటని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు. -
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ
ఆ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖలో టెండర్ దక్కాలంటే మంత్రిగారికి 1.5శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనంట. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ ఈడీ కోర్టుకు వెల్లడించింది. -
మోదీపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు అర్థం లేనివి: రాజ్నాథ్ సింగ్
ప్రధాని మోదీపై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. -
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
అతడు నా ఛాతి, కడుపుపై కాలితో తన్నాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఇంటి నుంచి వీడియో వెలుగులోకి.. ‘హిట్మ్యాన్’ అంటూ స్వాతీమాలీవాల్ పోస్టు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
-
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
-
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి