Cabinet:మరో ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామా
కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్న వేళ కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరికొన్ని గంటల్లోనే కేబినెట్ విస్తరణ జరగనుండగా కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్దన్ సహా ఇప్పటివరకు.....
దిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా మరో ఇద్దరు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటికే కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్దన్ సహా 10 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయగా.. తాజాగా రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావడేకర్ రాజీనామా చేశారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణతో చోటుచేసుకున్న మార్పుల్లో భాగంగా రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావడేకర్, డాక్టర్ హర్షవర్దన్, రమేశ్ పోఖ్రియాల్, సంతోష్ కుమార్ గంగ్వార్, సదానందగౌడతో పాటు రతన్లాల్ కటారియా, దేవశ్రీ చౌధురి, సంజయ్ ధోత్రే, రావు సాహెబ్ ధన్వే పాటిల్, అశ్వినీ చౌబే, బాబుల్ సుప్రియోలకు ఉద్వాసనకు గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ సిఫారసు మేరకు వీరి రాజీనామాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు.
కేంద్ర న్యాయ, ఐటీశాఖ మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టంపై ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలతో తలపడిన విషయం తెలిసిందే. అలాగే, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్న ప్రకాశ్ జావడేకర్ రాజీనామాను పెద్ద సర్ప్రైజ్గానే రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు, కరోనా సెకండ్వేవ్ను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యంపై గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరతతో పాటు వ్యాక్సినేషన్ విధానంపైనా విమర్శలు వచ్చిన నేపథ్యంలో హర్షవర్దన్ తాజాగా తన మంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం. అయితే, ఆరోగ్యశాఖ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే, అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకొంటున్నట్టు రమేశ్ పోఖ్రియాల్ స్పష్టంచేశారు. కొత్తగా 43మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఎవరెవరికి ఏయే మంత్రిత్వశాఖలు కేటాయిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక