India Corona: దిల్లీలో ఒక్కరోజే 50 శాతం పెరిగిన కొత్త కేసులు..

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా మళ్లీ వెయ్యికి దగ్గర్లోనే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే దేశ రాజధాని దిల్లీలో 24 గంటల వ్యవధిలో 50 శాతం మేర అధికంగా కొత్త కేసులు రావడం గమనార్హం.

Published : 14 Apr 2022 11:03 IST

మళ్లీ 11 వేల ఎగువకు క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా మళ్లీ వెయ్యికి దగ్గర్లోనే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, దేశ రాజధాని దిల్లీలో 24 గంటల వ్యవధిలో 50 శాతం మేర అధికంగా కేసులు రావడం గమనార్హం. ముందురోజు అక్కడ 202 మందికి కరోనా సోకగా..ప్రస్తుతం ఆ సంఖ్య 299కి చేరింది. కొవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం నుంచి 2.70 శాతానికి పెరిగింది. మరోపక్క దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్యలో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. గురువారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 

నిన్న 4.34 లక్షల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 1,007 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ముందురోజు కంటే ఏడు శాతం అధికంగా కేసులు వచ్చాయి. నిన్న దేశవ్యాప్తంగా ఒకే ఒక్క మరణం నమోదైంది. ఆ ఒక్కటి కూడా మహారాష్ట్రలో రికార్డయింది. 818 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది. క్రియాశీల కేసుల సంఖ్య 11,058(0.03 శాతం)గా ఉంది. నిన్న 14.48 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 186 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని