India Corona: అమాంతం పెరిగిన కరోనా కొత్త కేసులు..!

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత కొద్దిరోజులుగా 8 వేలకు పైగా నమోదవుతోన్న కొత్త కేసుల సంఖ్య తాజాగా 12 వేల మార్కు దాటాయి.

Updated : 16 Jun 2022 11:05 IST

ఎంతమందికి వైరస్ సోకిందంటే..?

దిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత కొద్దిరోజులుగా 8 వేలకు పైగా నమోదవుతోన్న కొత్త కేసుల సంఖ్య తాజాగా 12 వేల మార్కు దాటింది. ముందురోజు కంటే 38.4 శాతం అధికంగా రావడం ఆందోళన కలిగించే అంశం. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* బుధవారం 5.19 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..12,213 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 2.35 శాతానికి చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో ఈ స్థాయి వ్యాప్తి కనిపించింది. మహారాష్ట్ర(4,024), కేరళ(3,488), దిల్లీ, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. ఒక్క ముంబయిలోనే నిన్న రెండువేలకుపైగా కేసులొచ్చాయి. ఐదు నెలల తర్వాత అక్కడ అవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. దిల్లీలో వరుసగా రెండోరోజు 1,100 మందికి పైగా కరోనా బారినపడ్డారు. ఈ రెండేళ్లలో మొత్తం 4.32 కోట్ల మందికి ఈ మహమ్మారి సోకింది.

తాజా విజృంభణతో క్రియాశీల కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 58,215 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో దీని వాటా 0.12 శాతంగా ఉంది. 

24 గంటల్లో 7,624 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ 4.26 కోట్ల మందికిపైగా కోలుకోవడంతో రికవరీ రేటు 98.66 శాతంగా కొనసాగుతోంది. నిన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఏడాదిన్నర కాలంలో 195 కోట్లకు టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 15.21 లక్షల మంది టీకా తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని