Vaccine: థర్డ్వేవ్ ఆపాలంటే.. ఈ వేగం సరిపోదా?
ఎక్కువ జనాభాకు వ్యాక్సిన్ పంపిణీ చేయడం ద్వారా మూడో ముప్పు ప్రభావాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
నిత్యం 80లక్షల నుంచి కోటి డోసులు పంపిణీ చేయాల్సిందే అంటున్న నిపుణులు
దిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతితో వణికిపోయిన భారత్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ముప్పు ప్రభావం ఉందని నిపుణులు హెచ్చరించడంతో.. దానిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా థర్డ్వేవ్ ముప్పు ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ అధికారులు, ఆరోగ్య నిపుణులు, టీకా తయారీదారులు విశేష కృషి చేస్తున్నారు. ఎక్కువ జనాభాకు వ్యాక్సిన్ పంపిణీ చేయడం ద్వారా మూడో ముప్పు ప్రభావాన్ని తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సిన్ పంపిణీ వేగాన్ని మరింత పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిత్యం కోటి డోసుల పంపిణీ లక్ష్యం..
కరోనా థర్డ్ వేవ్ అనివార్యమైనప్పటికీ సాధ్యమైనంత వరకు దానిని నివారించాలంటే దేశ జనాభాలో దాదాపు 60శాతం మందికి రెండు డోసులు అందించాల్సి ఉంది. ఇందులో భాగంగా ప్రభుత్వం కూడా ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించుకుంది. అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇప్పటినుంచి దాదాపు ప్రతిరోజు కనీసం 80లక్షల డోసులు పంపిణీ చేయాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రతిరోజు కోటి 25లక్షల డోసులు పంపిణీ చేసే సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని.. అయినప్పటికీ నిత్యం కనీసం కోటి మందికి వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా ఈమధ్యే పేర్కొన్నారు. జులై నుంచి వేగాన్ని పెంచాలని అనుకున్నప్పటికీ ప్రస్తుతం ప్రతిరోజు 40లక్షల డోసులను మాత్రమే పంపిణీ చేయగలుగుతున్నారు. ఇదే వేగంతో పంపిణీ చేస్తే ప్రభుత్వం పెట్టుకున్న డిసెంబర్ లక్ష్యాన్ని చేరుకునేది కష్టంగానే కనిపిస్తోంది.
రోజువారీ సరాసరి 40లక్షల డోసులు..
దేశంలో కరోనా వ్యాక్సిన్ మెగా డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుంచి వ్యాక్సిన్ డోసుల పంపిణీ పెరిగింది. గతనెల చివరి వారంలో నిత్యం 80లక్షల డోసులను పంపిణీ చేశారు. తర్వాత అది 40లక్షలకు తగ్గింది. ఇక గత ఆదివారంనాడు కేవలం 15లక్షల డోసులను మాత్రమే పంపిణీ చేయగలిగారు. ఇలా వారంలో సరాసరిగా కేవలం 40లక్షల డోసులను మాత్రమే అందిస్తున్నారు. కొన్ని చోట్ల వ్యాక్సిన్ల కొరత, మరికొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వాల వైఫల్యం కారణంగా అధికమొత్తంలో వ్యాక్సిన్ పంపిణీ చేయకపోవడానికి కారణాలని నిపుణులు అంచనా వేస్తున్నారు.
జులైలో 12కోట్ల డోసులే..
పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ వేగంగా కొనసాగుతున్నప్పటికీ మరికొన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. దీంతో తమకు ఎక్కువ డోసులను పంపిణీ చేయాలని ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో జులైలో కేవలం 12కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, కేంద్రప్రభుత్వం ఉచితంగా ఇచ్చే డోసులకు అదనంగా మరో 25శాతం ప్రభుత్వ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. అందుకు తగ్గట్లుగానే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
వ్యాక్సిన్ల కొరతే కారణమా..?
దేశంలో కరోనా వ్యాక్సిన్లకు ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు టీకా కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పంజాబ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు తమకు ఎక్కువ డోసులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయినప్పటికీ రాష్ట్రాల వద్ద ఇంకా 2కోట్ల డోసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇదే సమయంలో దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిలో తయారీ సంస్థలు వేగం పెంచాయి. కొవిషీల్డ్ తయారుచేస్తోన్న సీరం ఇన్స్టిట్యూట్ కేవలం జూన్ నెలలోనే దాదాపు 10కోట్ల డోసులను కేంద్ర ప్రభుత్వానికి అందించినట్లు తెలిపింది. అటు భారత్ బయోటెక్ కూడా ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీటితో పాటు స్పుత్నిక్ టీకా డోసుల ఉత్పత్తిని పెంచేందుకు డాక్టర్ రెడ్డీస్ ఇతర సంస్థల సహకారం తీసుకొంటోంది. ఇక మోడెర్నా టీకాను భారత్లో దిగుమతి చేసుకునేందుకు ఇప్పటికే అనుమతి లభించింది. ఇలా స్థానికంగా ఉత్పత్తిని పెంచడంతో పాటు, దిగుమతి పెరిగితేనే భారత్లో వ్యాక్సిన్ డోసులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 35కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.