మీసాలు ట్రిమ్ చేయనందుకు ఉద్యోగం నుంచి సస్పెండ్!
మిమల్ని ఉద్యోగం నుంచి ఎందుకు సస్పెండ్ చేశారంటే సదరు వ్యక్తి చెప్పే కారణాలు... అవినీతి, అన్యాయం, అధర్మం, పని పట్ల అశ్రద్ధ, నిర్లక్ష్యం.. ఎవరి నుంచైనా ఇలాంటి ఫిర్యాదులే వింటాం. కానీ మధ్యప్రదేశ్ భోపాల్లోని ఓ కానిస్టేబుల్ని సస్పెండ్ చేసిన తీరు తెలిస్తే మాత్రం ఇదేం విడ్డూరం అనక మానదు.
భోపాల్: మీసాలు ట్రిమ్ చేయడానికి నిరాకరించాడనే కారణంతో మధ్యప్రదేశ్కు చెందిన ఓ కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు పడింది. తనను ఉద్యోగం నుంచి తొలగించినా సరే ఈ విషయంలో రాజీపడేది లేదంటున్నాడు ఆ కానిస్టేబుల్. అసలేం జరిగిందంటే..?
మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో రాకేశ్ రానా అనే వ్యక్తి కానిస్టేబుల్గా నియమితులయ్యారు. విధుల్లో ఉండగా మీసాలను ట్రిమ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. వాటిని పాటించేందుకు నిరాకరించాడట రాకేశ్ రానా. దీంతో నిబంధనలను పాటించనందుకు గానూ అతడిని సస్పెండ్ చేశారు. ‘‘పోలీస్ శాఖలో ఇలాంటి వైఖరిని ప్రోత్సహించం. మీసాన్ని మెడవరకూ పెంచాడు. వాటిని ట్రిమ్ చేయకుండా వస్తే.. అక్కడ పని చేసే సిబ్బందిపైనా రానా ప్రభావం పడేలా ఉంది. అందుకే విధుల నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది’’ అని అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రశాంత్ వర్మ తెలిపారు.
జరిగిన ఘటనపై రాకేశ్ రానా స్పందించాడు. ‘‘ఉద్యోగంపరంగా ఎలాంటి ఫిర్యాదులూ లేవు. నేను రాజ్పుత్ వంశం నుంచి వచ్చా. మీసాలు ఉండటమే మాకు గర్వకారణం. దాని కోసం సస్పెండ్ అయినా ఫర్వాలేదు. కానీ ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదు. నేనెప్పటికీ మీసాలు ట్రిమ్ చేయను. ఇది నా ఆత్మగౌరవంతో ముడిపడిన విషయం’’ అని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట