తొలిసారి ఓటు వేయలేకపోయిన ములాయం
దేశంలో కరోనా వ్యాప్తి విశృంఖలంగా కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా రోజూ 2లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. వైద్య సదుపాయాల కొరతకు తోడు నానాటికీ.....
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా వ్యాప్తి విశృంఖలంగా కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా రోజూ 2లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. వైద్య సదుపాయాల కొరతకు తోడు నానాటికీ మరణాల సంఖ్యా పెరుగుతుండటం తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నా వైరస్ ప్రళయం కొనసాగుతుండటంతో.. మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో అసాధారణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.
తొలిసారి ఓటేయలేకపోయిన ములాయం
లఖ్నవూ: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ తొలిసారి తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఆయన తన స్వగ్రామం సైఫాయిలో ఓటు వేసేందుకు వెళ్లలేదు. 81 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఓటు వేయడం తప్పలేదని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దిల్లీలో ఉన్న ములాయం సింగ్ను ఈసారి ఓటు వేసేందుకు రావొద్దని తామే కోరామని, అదృష్టవశాత్తు ఆయన అంగీకరించారని ములాయం బంధువు ధర్మేంద్ర యాదవ్ తెలిపారు. యూపీలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ సోమవారం జరిగింది.
దిల్లీలో మెట్రో రైళ్లు తిరుగుతాయ్..
దిల్లీ: దిల్లీలో సోమవారం రాత్రి 10గంటల నుంచి ఏప్రిల్ 26 ఉదయం 5గంటల వరకు పూర్తి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల సేవలు అందుబాటులోనే ఉంటాయని దిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ వెల్లడించింది. రద్దీ అధికంగా ఉన్న సమయాలైన ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు; అలాగే, సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ప్రతి 30 నిమిషాలకు రైళ్లు నడుస్తాయని స్పష్టంచేసింది. మిగతా సమయాల్లో మాత్రం ప్రతి 60 నిమిషాలకు రైళ్లు నడపనున్నట్టు తెలిపింది. 50శాతం సిటింగ్సామర్థ్యంతోనే రైళ్లు నడుపుతున్నట్టు స్పష్టంచేసింది.
వీసా సర్వీసులు నిలిపివేస్తున్నాం.. రష్యా ఎంబసీ!
దిల్లీ: కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో భారత్లోని వీసా సర్వీసుల విభాగాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు రష్యా ఎంబసీ కార్యాలయం వెల్లడించింది. తదుపరి నోటీసు ఇచ్చేవరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ట్విటర్లో తెలిపింది.
పెళ్లిళ్లకు 20మంది మించొద్దు!
చండీగఢ్: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్షించిన సీఎం అమరీందర్ సింగ్ రాత్రిపూట కర్ఫ్యూ వేళల్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. గతంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు అమలులో ఉన్న రాత్రిపూట కర్ఫ్యూ సమయాన్ని రాత్రి 8గంటల నుంచి ఉదయం 5గంటల వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. రేపట్నుంచి ఈ నెల 30 వరకు జిమ్లు, కోచింగ్ సెంటర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు మూసివేస్తున్నట్టు తెలిపారు. అలాగే, వివాహాలు, అంత్యక్రియలకు 20మందికి మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.
రాత్రి 8కల్లా రెమిడెసివిర్ నాగ్పుర్కు పంపండి
ముంబయి: కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు నాగ్పుర్ బెంచ్ కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ రోజు రాత్రి 8గంటల కల్లా కరోనా నియంత్రణ ఔషధం రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను పంపాలని ఆదేశించింది. కరోనాతో అల్లాడుతున్న నాగ్పూర్ నగరానికి 10వేల రెమ్డిసివిర్ ఇంజెక్షన్లు పంపాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్