కొవిడ్ కేర్ సెంటర్లుగా స్టార్ హోటళ్లు..!
మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోన్న వేళ.. కొన్ని స్టార్ ఆసుపత్రులను కూడా కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చేందుకు బీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు.
ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం
కొవిడ్ పడకల పెంపుపై పలు రాష్ట్రాల దృష్టి
ముంబయి: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి మరోసారి కొనసాగుతోన్న వేళ.. కొవిడ్ ప్రత్యేక ఆసుపత్రులపై ఆయా రాష్ట్రాలు దృష్టి సారించాయి. కొవిడ్ రోగులతో ఆసుపత్రుల్లో రద్దీ ఎక్కువ అవుతుండడంతో వారికి వైద్య సదుపాయం కలిగించేందుకు మరిన్ని ప్రత్యేక పడకలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రైవేటు ఆసుపత్రులు, హోటళ్లను కూడా కొవిడ్ రోగుల వైద్య సేవలకోసం వినియోగించాలని ఆదేశిస్తున్నాయి.
కొవిడ్ కేర్ సెంటర్లుగా స్టార్ హోటళ్లు..!
కరోనా వైరస్ విలయానికి మహారాష్ట్ర వణికిపోతోంది. నిత్యం కొత్తగా 50వేల పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో 2వేల పడకల సామర్థ్యం కలిగిన మూడు ప్రత్యేక కొవిడ్ ఆసుపత్రులకు అందుబాటులోకి తెచ్చేందుకు ముంబయి అధికారులు సిద్ధమయ్యారు. వీటితో పాటు కొన్ని స్టార్ ఆసుపత్రులను కూడా కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యుల సహకారంతో ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఐఎస్ చాహల్ వెల్లడించారు.
మరో మూడు వారాల్లో 2వేల పడకల సామర్థ్యం కలిగిన మూడు కొవిడ్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురావాలని మహారాష్ట్ర అధికారులు నిర్ణయించారు. ప్రతి కేంద్రంలో 200 ఐసీయూ పడకలు, 70శాతం ఆక్సిజన్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కొవిడ్ కేర్ సెంటర్లుగా ఏర్పాటు చేసేందుకు పలు స్టార్ హోటళ్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. కొవిడ్ ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో అవసరమైన రోగులకు వైద్య సదుపాయాలను సమకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ముంబయిలో 141 ఆసుపత్రుల్లో 19వేల పడకలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 2466 ఐసీయూ పడకలు ఉండగా.. త్వరలోనే మరిన్ని ఐసీయూ పడకలను సిద్ధం చేస్తామన్నారు.
ప్రైవేటు ఆసుపత్రులకు పిలుపు..
కరోనా తీవ్రత కొనసాగుతోన్న నేపథ్యంలో మధ్యప్రదేశ్లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్థానికంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. దీంతో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రైవేటు ఆసుపత్రులు ముందుకు రావాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమయ్యే స్థలాన్ని ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పారు. తద్వారా వీలైనన్నీ కొవిడ్ ప్రత్యేక పడకలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. వీటితో పాటు మరో 2వేల ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఆర్డర్ ఇచ్చామని ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ వెల్లడించారు.
అవసరమైతే తప్ప ఆసుపత్రికి వెళ్లొద్దు..
దేశ రాజధానిలోనూ కొవిడ్ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈ సమయంలో దిల్లీలో కొవిడ్ ఆసుపత్రులను పెంచాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు చాలా ప్రైవేటు ఆసుపత్రులను మరోసారి కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలన్నారు. ప్రస్తుతానికి దాదాపు 115 ప్రైవేటు ఆసుపత్రుల్లో సగం పడకలను కొవిడ్ రోగులకు కేటాయించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అవసరమైతే తప్ప కరోనా రోగులు ఆసుపత్రులకు వెళ్లకూడదని సూచించారు. ప్రస్తుతం దిల్లీలో 5525 కొవిడ్ పడకలు ఉన్నాయని..రానున్న రోజుల్లో మరిన్ని అందుబాటులోకి తెస్తామని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. నగరంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10వేలు దాటడం ఆందోళనకర విషయమని ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని కేజ్రీవాల్ సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!