కశ్మీర్లో ఉగ్రవాదం తర్వాత పెద్ద సవాల్ అదే..!
పాక్ ముష్కరుల దుశ్చర్యలతో నిత్యం తూటా పేలుళ్లతో దద్ధరిల్లే జమ్మూకశ్మీర్ మరో అతిపెద్ద సవాల్ను ఎదుర్కొంటోందని డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు........
డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడి
జమ్మూ: పాక్ ముష్కరుల దుశ్చర్యల కారణంగా నిత్యం తూటా పేలుళ్లతో దద్ధరిల్లే జమ్మూకశ్మీర్ మరో అతిపెద్ద సవాల్ను ఎదుర్కొంటోందని డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం తర్వాత అతిపెద్ద సవాల్గా మాదకద్రవ్యాల అక్రమ రవాణా మారిందని ఆయన వెల్లడించారు. 2020లో జమ్మూకశ్మీర్లో దాదాపు 1600 మందికి పైగా అనుమానిత డ్రగ్ వ్యాపారులను అరెస్టు చేసినట్టు తెలిపారు. గతేడాది మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున డ్రైవ్ నిర్వహించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా 1132 కేసులు నమోదు చేసి 1672మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. వీరిలో 35మంది మాదకద్రవ్యాల వ్యాపారులపై ప్రజా సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
ఈ మాదకద్రవ్యాలు ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచేందుకు దోహదంచేయడమే కాకుండా యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్ వ్యాపారుల నుంచి 152.18కిలోల హెరాయిన్, 563.61 కిలోల గంజాయి, 22,230 కిలోల నల్లమందుతో పాటు మరికొన్ని డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.