భారత్లో కరోనా: 149 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్!
దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ..గడిచిన వారం రోజుల్లో 149జిల్లాల్లో కొత్తకేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు.
కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ.. గడిచిన వారం రోజుల్లో 149 జిల్లాల్లో కొత్తకేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. కరోనా వైరస్ విస్తృతిపై కేంద్ర మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన, గత రెండు వారాల్లో ఎనిమిది జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదన్నారు. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని, ఇంతవరకూ 9.3కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు తెలిపారు.
‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగానే..
అంతర్జాతీయ సమాజానికి సహాయం అందించడంలో భాగంగా.. భారత్ చేపట్టిన ‘వ్యాక్సిన్ మైత్రి’ ద్వారా విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 85 దేశాలకు 6.45 కోట్ల డోసులను ఎగుమతి చేశామని, వీటిలో 25దేశాలకు 3.58 కోట్ల డోసులను వాణిజ్యపరంగా సరఫరా చేశామని చెప్పారు. 44 దేశాలకు మాత్రం 1.04 కోట్ల డోసులను గ్రాంట్ రూపంలో అందించామన్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని ‘కొవాక్స్’ కార్యక్రమం కింద 39 దేశాలకు 1.82 కోట్లను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
రోజువారీ కేసుల్లో 5.37 శాతం పెరుగుదల
దేశంలో కరోనా కేసుల సంఖ్య నిత్యం రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. ప్రస్తుతం రోజువారీగా 5.37 శాతం పెరిగినా, మరణాల రేటు 1.28 శాతానికి తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా పాజిటివ్ కేసుల్లో వారం పెరుగుదల 12.93 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. భారత్ కంటే అమెరికా, బ్రెజిల్లోనే కరోనా పెరుగుదల రేటు అధికమని పేర్కొంది.
2084 కొవిడ్ ఆసుపత్రులు
దేశంలో పెరుగుతోన్న కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆసుపత్రుల్లో ప్రత్యేక వసతులను పెంచుతున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 2084 కొవిడ్ ఆసుపత్రులు ఉన్నాయని, వీటిలో 4.68 లక్షల కొవిడ్ పడకలు ఉన్నాయని తెలిపింది. వీటిలో 2,63,573 ఐసోలేషన్ పడకలు, 50,408 ఐసీయూ, 1.5 లక్షల ఆక్సిజన్ వసతి ఉన్న పడకలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం