Pakistan: భారత్ ‘ఏజెంట్ మిశ్రా’ను పాక్ గుర్తుపట్టేసింది..!
ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో కామెడీ చేసేవారికి కరవేలేదు. వీలైనప్పుడల్లా ఒళ్లుదాచుకోకుండా వినోదాన్ని పంచుతారు.
* ఫవాద్ చౌధరీ మరో కామెడీ
* ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో కామెడీ చేసేవారికి కరవేలేదు. వీలైనప్పుడల్లా వినోదాన్ని పంచుతారు. ఆ తర్వాత నెటిజన్లు వీరిని ఒక ఆట ఆడుకుంటారు. ఇది షరా మాములైపోయింది. తాజాగా ఈ సారి ఆ దేశ సమాచార మంత్రి ఫవాద్ చౌధరీ వంతు వచ్చింది. పాక్లో న్యూజిలాండ్ పర్యటన రద్దుకావడానికి భారతే కారణమని ఆయన ఇటీవల ఆరోపించారు. భారత్ నుంచి వెళ్లిన బెదిరింపుల కారణంగా న్యూజిలాండ్ పర్యటనను రద్దు చేసుకొందని విశ్లేషించారు. మార్టిన్ గప్తిల్ భార్యకు బెదింరిపులతో కూడిన ఈమెయిల్ పంపించడంతోనే ఈ టూర్ రద్దయిందని తెలిపారు.
మంత్రిగారు సెలవిచ్చిన కారణాలు..
* భారత్లోని ఒక ఆంగ్ల పత్రికలో న్యూజిలాండ్ జట్టుపై దాడి జరగడానికి ఉన్న అవకాశాలను విశ్లేషిస్తూ ఆగస్టు 21న వ్యాసం ప్రచురితమైంది. న్యూజిలాండ్ జట్టు పర్యటన రద్దు చేసుకోవడానికి గల కారణాల్లో ఇది ఒకటిని పాక్ మంత్రి ఫవాద్ చౌధరీ పేర్కొన్నారు.
* ఇక ఓం ప్రకాశ్ మిశ్రా అనే వ్యక్తి పాక్లోని తెహ్రీక్ ఈ తాలిబన్ పేరిట ముంబయిలో ఓ తప్పుడు ఐడీ సృష్టించాడని పేర్కొన్నారు. దీనిలో వీపీఎన్ వాడి సింగపూర్లో ఉన్నట్లు లోకేషన్ చూపించాడన్నారు. హమ్జా అఫ్రిదీ పేరిట న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ భార్యకు బెదింరింపుల ఈమెయిల్ పంపించారు. ఈ క్రమంలో ఓం ప్రకాశ్ మిశ్రా ఫొటోను కూడా పాక్ మంత్రి ప్రదర్శించారు. ఈ ఫోటోను చూడగానే మంత్రిగారు ఏదో కామెడీ షో చేస్తున్నారని నెటిజన్లకు అర్థమైపోయింది.
ఎవరీ ఓం ప్రకాశ్ మిశ్రా..?
ఓం ప్రకాశ్ మిశ్రా సోషల్ మీడియాలో ఓ ర్యాపర్. 2017లో ‘బోలోనా ఆంటీ’ అంటూ ఇతను చేసిన ఓ వెకిలి ర్యాప్ సాంగ్ సోషల్ మీడియాలో హాస్యాన్ని పండించింది. అప్పట్లో యూట్యూబ్ రోస్టర్లు ఈ పాటను రోస్టింగ్ చేశారు. అతేకాదు అతను ఓ మీమ్ మెటీరియల్గా మారిపోయాడు. ఇతనిది ఉత్తర్ ప్రదేశ్లోని పూర్వాంచల్ ప్రాంతం. తాజాగా ఓం ప్రకాశ్ మిశ్రా పేరును ఫవాద్ చౌధరీ ఈ వివాదంలోకి లాగారు. దీంతో అతడి పేరు ట్విటర్లో ట్రెండింగ్ కావడం మొదలైంది.
మిశ్రా మెయిల్కు ‘ఫైవ్ ఐస్’ భయపడుతుందా..?
ఫైవ్ ఐస్ అనేది ఐదు దేశాలు కలసి సమష్టిగా ఏర్పాటు చేసుకొన్న ఇంటెలిజెన్స్ నెట్వర్క్. దీనిలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్లు సభ్య దేశాలు. సముద్రాలపై నిఘా, కోవర్ట్ సమాచారం, హ్యూమన్ ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం సేకరిస్తాయి. వీటిని మిత్రదేశాలతో పంచుకొంటాయి. సీఐఏ,ఎంఐ వంటి కాకలు తీరిన సంస్థలు ఇందులో పనిచేస్తాయి. అలాంటి బృందంలోని సభ్యదేశమైన న్యూజిలాండ్ ర్యాపర్ మిశ్రా బెదిరింపు మెయిల్కు భయపడి మూటాముల్లె సర్దుకొంటుందా..? జనం తన మాటలు నమ్ముతారని ఫవాద్ ఛౌదరీ ఎలా అనుకున్నారో..?
వాచాలత్వానికి పెట్టింది పేరు.. ఫవాద్ చౌధరీ..!
2020లో ఈయన ఓ ట్వీట్ చేశారు. అందులో భారత్ పేరును, లాక్డౌన్ స్పెల్లింగ్ను కూడా తప్పుగా రాశారు. అప్పట్లో ఈయన గారు పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా కూడా పనిచేశారు. 2019 అక్టోబర్లో ఆయన ఓ విచిత్రమైన ట్వీట్ చేశారు. లాహోర్లో వాయు కాలుష్యం పెరగడానికి భారత్ కారణమని ఆరోపించారు. దిల్లీ నుంచి అమృత్సర్ వరకు పంటలను దహనం చేయడం వల్ల పాకిస్థాన్లోని లాహోర్లో కాలుష్యం పెరిగిందని సెలవిచ్చారు. దీనిని నియంత్రించడంలో మోదీ సర్కారు విఫలమైందని కూడా మండిపడ్డారు.
* ‘‘భారత్లోకి వెళ్లి మరీ కొట్టాం’’ అంటూ పుల్వామా దాడి పాక్పనే అని అంగీకరించేలా ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ఎఫ్ఏటీఎఫ్ గ్రేలిస్ట్లో ఉన్న పాక్ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లైంది. ఆ తర్వాత ఫవాద్ మాటమార్చారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని పేర్కొన్నారు. తాను ఎఫ్-16 విమానాలు భారత్లో ప్రవేశించిన అంశాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు.
ఉగ్రవాదులు పెంచేది పాక్.. దాడుల బాధ్యత భారత్దా..?
లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఇంటివద్ద జూన్ 23వ తేదీన బాంబుదాడి భారత్ పనే అని పాక్ అధ్యక్షుడు ఆరీఫ్ అల్వీ ఆరోపించారు. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు పలు గ్రూపులతో వివాదాలు ఉన్నాయి. ఆ తర్వాత పాక్లోనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
* ఇటీవల పాక్లోని దసు డ్యామ్ వద్ద ఒక బస్సును ఉగ్రవాదులు పేల్చేశారు. అందులో భారీ సంఖ్యలో చైనీయులు మృతి చెందారు. తొలుత బాంబు పేలుడు కాదని బుకాయించిన పాక్ ఆ తర్వాత అది ఆత్మాహుతి దాడిగా అంగీకరించింది. దీనికి భారత్, అఫ్గానిస్థాన్లను తప్పుబట్టింది. కానీ, పాక్లోని టీటీపీ ఉగ్రవాద సంస్థ దీనికి బాధ్యత తీసుకొంది.
* ఐక్యరాజ్య సమితి వేదికగా కూడా అబద్ధాలు చెప్పిన ఘన చరిత్ర పాక్కు ఉంది. 2017లో ఐరాసలో పాక్ శాశ్వత ప్రతినిధి మలేహా లోధి మాట్లాడుతూ.. కశ్మీర్ భారత్ సైన్యం పిల్లెట్ గన్ వాడటంతో గాయపడిన యువతి అంటూ ఓ ఫొటోను ఐరాసలో ప్రదర్శించారు. ఆ తర్వాత భారత ప్రతినిధి పౌలమీ త్రిపాఠీ మాట్లాడుతూ లోధి ప్రదర్శించిన ఫొటో పాలస్తీనా బాలికదని నిరూపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.