Rahul Gandhi: జోడో యాత్రలో ‘మోదీ’ అంటూ నినాదాలు.. రాహుల్ రియాక్షన్ చూశారా?
భారత్ జోడో యాత్రలో ‘మోదీ.. మోదీ’ అంటూ కొందరు నినాదాలు చేశారు. వారికి రాహుల్ గాంధీ ‘ముద్దుల’తో కౌంటర్ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)’లో కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. రాహుల్ పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుండగా కొందరు భాజపా మద్దతుదారులు ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు చేశారు. అయితే ఆ నినాదాలకు స్పందనగా రాహుల్.. వారికి ‘ముద్దులు’ పెట్టడం గమనార్హం.
రాహుల్ గాంధీ నేతృత్వం వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఆదివారం సాయంత్రం మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్లోకి ప్రవేశించింది. అయితే మధ్యప్రదేశ్లోని అగర్ మల్వా జిల్లాలో రాహుల్ (Rahul Gandhi) యాత్ర కొనసాగుతుండగా.. కొందరు భాజపా మద్దతుదారులు ప్రధానికి మద్దతుగా ‘మోదీ.. మోదీ (Modi)’ అంటూ నినాదాలు చేశారు. ఇది చూసిన రాహుల్ గాంధీ తొలుత వారిని నినాదాలు ఆపాలని చేతితో సైగలు చేశారు. అయినప్పటికీ వారు నినాదాలు కొనసాగించడంతో.. జోడోలో పాల్గొన్న కాంగ్రెస్శ్రేణులు కూడా గట్టిగా నినాదాలు చేయాలని రాహుల్ కోరారు. ఆ తర్వాత భాజపా మద్దతుదారుల వైపు తిరిగి గాల్లో ముద్దులు విసిరారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ప్రస్తుతం జోడో యాత్ర కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్లో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్, ఇతర కీలక నేతలు యాత్రలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.