Jodhpur tension: ఘర్షణ జరుగుతుంటే.. మౌనప్రేక్షకుల్లా ఉంటారా?: సీఎంపై కేంద్రమంత్రి విమర్శలు
రంజాన్ వేడుకల వేళ రాజస్థాన్లోని జోధ్పూర్లో చెలరేగిన ఘర్షణలపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. .......
దిల్లీ: రంజాన్ వేడుకల వేళ రాజస్థాన్లోని జోధ్పూర్లో చెలరేగిన ఘర్షణలపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అల్లర్లతో అశోక్ గహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తృప్తి చెందిందంటూ విమర్శలు గుప్పించారు. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడం ముందస్తు వ్యూహం ప్రకారమే జరిగిందనీ.. ఉద్రిక్తతలు కొనసాగుతుంటే రాజస్థాన్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం మౌనప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారని మండిపడ్డారు. మతపరమైన ఉద్రిక్తతల్ని నివారించేందుకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలూ తీసుకోలేదని ఆరోపించారు. పోలీసులు, అధికార యంత్రాంగం ఏదో కనిపించని ఒత్తిడిలో పనిచేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. జోధ్పూర్లో అల్లర్లు చెలరేగితే.. ఈ మధ్యాహ్నం 3గంటల వరకు సీఎం అశోక్ గహ్లోత్ శాంతి, సామరస్యత కోరుతూ ఎలాంటి విజ్ఞప్తి చేయలేదన్నారు. రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా రాష్ట్రంలో హింస జరుగుతుంటే సీఎం అశోక్ గహ్లోత్ పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారని కేంద్రమంత్రి షెకావత్ ఆరోపించారు. ఈ ఘర్షణల వెనుక ఎవరున్నారో, ఈ ఘటనలో రాష్ట్రప్రభుత్వం, అధికార యంత్రాంగం పాత్ర ఏమిటనే అంశాలపై దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు.
మరోవైపు, నిన్న అర్ధరాత్రి జోధ్పూర్లో జలోరి గేటు సర్కిల్ వద్ద ఒక వర్గం వారు జెండాలు పెట్టడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలకు చెందినవారు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి. అయితే, మంగళవారం తెల్లవారేసరికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించినప్పటికీ ఈ ఉదయం ఈద్ ప్రార్థనల అనంతరం మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. జలోరి గేటు ప్రాంతంలో దుకాణాలు, వాహనాలు, ఇళ్లపై రాళ్ల దాడి జరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నగరంలోని మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేయడంతో పాటు 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. ప్రజలంతా శాంతి, సామరస్యతతో మెలగాలని సీఎం గహ్లోత్ విజ్ఞప్తి చేశారు. మే 4 అర్ధరాత్రి వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందనీ.. పుకార్లకు చెక్ పెట్టేందుకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను పోలీసులు రద్దు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక