రామభక్తులపై దాడిచేస్తే సరైన సమాధానమిస్తాం!
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామాలయం నిర్మాణానికి నిధులు సేకరిస్తున్న రామభక్తులపై దాడులకు పాల్పడిన వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తగిన సమాధానం చెబుతుందని భాజపా ఎంపీ, సాధ్వి ప్రగ్యా ఠాకూర్ హెచ్చరించారు. మతసామరస్యాన్ని, అశాంతిని రెచ్చగొట్టేందుకే కొన్ని దుష్ట శక్తులు ఇలాంటి పనులకు ..
భాజపా ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్
ముంబయి: శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామాలయం నిర్మాణానికి నిధులు సేకరిస్తున్న రామభక్తులపై దాడులకు పాల్పడిన వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తగిన సమాధానం చెబుతుందని భాజపా ఎంపీ, సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ హెచ్చరించారు. మతసామరస్యాన్ని, అశాంతిని రెచ్చగొట్టేందుకే కొన్ని దుష్ట శక్తులు ఇలాంటి పనులకు పూనుకొంటున్నాయని అన్నారు. అలాంటి వ్యక్తులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మాలేగావ్ బాంబుపేలుళ్ల విచారణలో భాగంగా ముంబయిలోని స్పెషల్ ఎన్ఐఏ న్యాయస్థానం ఎదుట ఆమె నేడు హాజరయ్యారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులుండగా.. ఇప్పటి వరకు సమీర్ కులకర్ణి, అజయ్ రాహిర్కర్, ప్రసాద్ పురోహిత్ మాత్రమే విచారణకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.
2008 సెప్టెంబర్ 29న గుజరాత్, మహారాష్ట్రలో వరుస బాంబుపేలుళ్లలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 80 మందికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని మాలేగావ్లో 9మంది చనిపోగా, గుజరాత్లోని మొదసాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ నిందితురాలిగా ఉన్నారు.
ఇదీ చదవండి
రెండు స్టార్ హోటళ్లు.. 100మందికిపైగా కరోనా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం