కొవిడ్‌ టీకా వేయించుకున్న రాష్ట్రపతి

దేశంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టే బృహత్తర కార్యక్రమంలో భాగంగా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. ఇటీవలే రెండో దశ టీకా పంపిణీ ప్రారంభించగా.. దేశ ప్రథమ

Updated : 03 Mar 2021 14:24 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టే బృహత్తర కార్యక్రమంలో భాగంగా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. ఇటీవలే రెండోదశ టీకా పంపిణీ ప్రారంభించగా.. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం వ్యాక్సిన్‌ తొలిడోసు వేయించుకున్నారు. ఈ మధ్యాహ్నం దిల్లీలోని ఆర్మీ రీసెర్చి అండ్‌ రిఫరల్‌ ఆసుపత్రిలో ఆయన కొవిడ్‌ టీకా తీసుకున్నారు.

రాష్ట్రపతి వెంట ఆయన కుమార్తె కూడా వచ్చారు. ఈ ఫొటోలను రాష్ట్రపతి ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. చరిత్రలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు రామ్‌నాథ్‌ కోవింద్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. అర్హులైన పౌరులందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. 

దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి రెండోదశ టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 60ఏళ్ల పైబడిన, 45-59ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు ఈ దశలో వ్యాక్సిన్‌ వేస్తున్నారు. గత సోమవారం ప్రధాని మోదీ తొలిడోసు టీకా తీసుకోగా.. ఆ తర్వాత పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు టీకా‌ వేయించుకున్నారు. కేరళ, గోవా ముఖ్యమంత్రులు పినరయి విజయన్‌, ప్రమోద్‌ సావంత్‌ నేడు టీకా తీసుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని