Priyanka Gandhi : బొకే ఇచ్చారు సరే.. మరి పూలు ఎక్కడ..?: ప్రియాంకాగాంధీ వీడియో వైరల్‌

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi)కి చెందిన సరదా వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.

Updated : 07 Nov 2023 11:36 IST

భోపాల్‌: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ అన్ని పార్టీల అగ్రనేతలు విరామం లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో సరదా పరిణామం ఒకటి చోటుచేసుకుంది. సభా వేదికపై కాంగ్రెస్‌(Congress) అగ్రనేత ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi)కి ఓ నాయకుడు బొకే ఇవ్వగా.. దానిని చూసి ఆమె  నవ్వకుండా ఉండలేకపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

సోమవారం ప్రియాంక(Priyanka Gandhi) మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని ఇందౌర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా హస్తం పార్టీ నేతలు వేదికపై ఒకరి తర్వాత ఒకరు ఆమెను కలిశారు. కొందరు ఆమెతో ఫొటోలు దిగారు. మరికొందరు పూలు ఇచ్చి ఆమెను పలకరించారు. ఈ సమయంలోనే ఓ నేత వేదికపైకి వచ్చి ఆమెకు బొకే ఇచ్చారు. దానిని చూసిన వెంటనే ప్రియాంక కాస్త ఆశ్చర్యంగా మొహం పెట్టి.. నవ్వుకున్నారు. ఆ బొకేలో పూలు లేకపోవడమే అందుకు కారణం. అక్కడితో ఆగకుండా ఆ బొకేను చూపిస్తూ.. ఇందులో పూలు ఏవి? అని ఆ నేతను సరదాగా ప్రశ్నించడంతో సభావేదికపై నవ్వులు విరబూశాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఓటు వేయకుండానే వెళ్లిపోయిన సీఎం.. కారణమిదే..!

ఆ వెంటనే ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రియాంక(Priyanka Gandhi).. నిత్యావసరాల ధరల పెరుగుదలపై భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారు. నవంబర్‌ 17న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సత్తా చాటి, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని