నోటి దురుసు ఖురేషీది.. ప్రాయశ్చిత్తం భజ్వాది
‘పేదవాడి కోపం పెదవికి చేటు’ ఈ విషయం పాకిస్థాన్కు ఇప్పుడు బాగా తెలిసొచ్చింది. కశ్మీర్ విషయంలో భారత్తో కయ్యానికి తోడురావడంలేదని పాక్కు కోపం వచ్చింది. ఆ దేశ విదేశాంగ షా మహమూద్ ఖురేషీ ఆగస్టు 5వ తేదీన ఓ చానల్తో మాట్లాడుతూ
సౌదీని ప్రసన్నం చేసుకోవడం కోసం పాక్ సైన్యాధిపతి అవస్థలు
ఇంటర్నెట్డెస్క్ : ‘పేదవాడి కోపం పెదవికి చేటు’ ఈ విషయం పాకిస్థాన్కు ఇప్పుడు బాగా తెలిసొచ్చింది. కశ్మీర్ విషయంలో భారత్తో కయ్యానికి తోడురావడంలేదని పాక్కు కోపం వచ్చింది. ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఆగస్టు 5వ తేదీన ఓ ఛానల్తో మాట్లాడుతూ పరోక్షంగా సౌదీ అరేబియాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యల ఫలితాన్ని పాక్ అనుభవిస్తోంది. ఆర్థికంగా అండగా నిలిచిన సౌదీ.. ఇప్పుడు మెల్లిగా పక్కకు తప్పుకోవడంతోపాటు.. గతంలో ఇచ్చిన అప్పులను వసూలు చేయడం మొదలుపెట్టింది. ఓ పక్క కరోనావైరస్.. మరోపక్క ఆర్థిక ఇబ్బందులతో పాక్ పరిస్థితి ఘోరంగా తయారైంది. చివరికి సౌదీ రాజు అపాయింట్మెంట్ కూడా పాక్ ఆర్మీ చీఫ్ భజ్వాకు దొరకలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అసలేం జరిగింది..
ముస్లిం దేశాల్లో రెండు వర్గాలు ఉన్నాయి. పెద్ద వర్గానికి సౌదీ నాయకత్వం వహిస్తుండగా.. మరో వర్గానికి ఇరాన్, టర్కీ నాయకత్వం వహిస్తున్నాయి. దీంతో సౌదీకి ఈ దేశాలకు మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. అమెరికాతో సన్నిహితంగా ఉండే సౌదీ కేవలం చమురుతోనే ఇస్లాం ప్రపంచంపై పట్టు సాధించలేమని గుర్తించింది. దీంతో మెల్లగా దేశంలో ఇతర రంగాలను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో అమెరికా, భారత్, ఐరోపా సంఘం మద్దతు సౌదీకి చాలా అవసరం. దాదాపు 130 కోట్ల మంది ఉన్న భారత మార్కెట్ను దూరం చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) గ్రహించారు. అందుకే కశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించినప్పుడు కూడా స్పందించలేదు. ఇది పాకిస్థాన్కు కొంత కోపం తెప్పించింది.
సౌదీ ప్రత్యామ్నాయానికి పాక్ మద్దతు..
57 దేశాలు ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ)లో సౌదీ, యూఏఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనిని సవాలు చేసే విధంగా మరో ప్రత్యామ్నాయ సంస్థను ఏర్పాటు చేసేందుకు టర్కీ, ఇరాన్, ఖతార్, మలేషియా ప్రయత్నించాయి. ఈ క్రమంలో గతేడాది ఇమ్రాన్ ఖాన్ అమెరికా వెళ్లేందుకు సౌదీ యువరాజు విమానం పంపించారు. కానీ, అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ టర్కీ, మలేషియాలతో అంటకాగుతున్నట్లు గ్రహించి తన విమానాన్ని వెనక్కి తెప్పించారు. దీంతో పాక్ ప్రధాని సాధారణ విమానంలో వెనక్కి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత కౌలాలంపూర్లో టర్కీ, మలేషియా గతేడాది ఓ సమావేశం ఏర్పాటు చేశాయి. దీనికి తొలుత పాక్ మద్దతు తెలిపినా.. సౌదీ కన్నెర్ర చేయడంతో ఈ సదస్సు నుంచి వైదొలగింది. నాటి నుంచి పాక్పై సౌదీకి అనుమానాలు పెరిగాయి.
పాక్ నుంచి సాయం వాపస్..
ఈ ఏడాది ఆగస్టు 5తో ఆర్టికల్ 370 తొలగించి ఏడాది పూర్తయింది.. ఈ సందర్భంగా పాక్ విదేశాంగ శాఖ మంత్రి సౌదీ అరేబియాను బహిరంగంగానే విమర్శించారు. కశ్మీర్ విషయంలో తమతో కలిసి రావడంలేదని.. కలిసి వచ్చేవారితోనే పనిచేస్తామని అన్నారు. ఖురేషీ వ్యాఖ్యల్లో ఓఐసీకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామనే అర్థం ధ్వనించడంతో సౌదీ అరేబియాకు కోపం వచ్చింది. పాక్ చర్యకు ప్రతిచర్య ఆ దేశ ఖజానాలో కనిపించింది. సౌదీ రుణంగా ఇచ్చిన 3 బిలియన్ డాలర్లను వాపస్ తీసుకోవడం మొదలుపెట్టింది. దీంతో చైనా నుంచి అప్పు తెచ్చి బిలియన్ డాలర్లను వాపస్ చేసింది.
భారత్తో కయ్యం పెట్టుకోవాలని పదేపదే పాక్ ఒత్తిడి తేవడం సౌదీకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో పాకిస్థాన్ సైన్యాధిపతి కమర్ జావెద్ భజ్వా రంగంలోకి దిగి ఇరు దేశాల సంబంధాలను పూర్వస్థితికి తెచ్చేందుకు సౌదీకి పయనమయ్యారు. అక్కడ ఆయనకు యువరాజు సల్మాన్ అపాయింట్మెంట్ కూడా లభించలేదు. కేవలం రక్షణ శాఖ ఉపమంత్రి ఖలీద్ బిన్ సల్మాన్.. మిలటరీ చీఫ్ ఫయాద్తో భేటీ మాత్రమే జరిగింది. ఇది పాక్కు పెద్ద ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు. గతంలో అయితే అమెరికా సాయం చేసేది.. ఇప్పుడు పాక్ పూర్తిగా చైనా పక్షాన చేరడంతో ఆ సాయం కూడా లభించలేదు.
ఇమ్రాన్ సెక్రటరీపై చెయ్యి చేసుకొన్న ఖురేషీ
సౌదీ అరేబియాను ప్రసన్నం చేసుకొనేందుకు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీని పక్కనపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన స్థానంలో షరీన్ మజారీ అనే మరో మంత్రికి అవకాశం కల్పించవచ్చు. ఖురేషీ వ్యాఖ్యలపై ఇప్పటికే షరీన్ మండిపడ్డారు. ఈ ఘటనతో ఇమ్రాన్ ప్రభుత్వం ఖురేషీకి దూరంగా జరుగుతోందని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. తర్వాత దశలో ఖరేషీని తప్పించవచ్చు. ఇప్పుడు ఖురేషీ మరో వివాదంలో కూడా ఇరుక్కున్నారు. ఖురేషీ ప్రధాని కార్యాలయానికి వచ్చినప్పుడు అక్కడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన్ను లోపలకు రానీయలేదు. దీంతో ఏకంగా ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆజమ్ ఖాన్ను ఖురేషి చెంపదెబ్బ కొట్టినట్లు పాక్ న్యూస్ ఛానల్ పేర్కొంది. అంతకు ముందు అజమ్ ఖాన్.. ఖురేషీలు పరస్పరం దూషించుకొన్నారు. పాక్ దూరం అయ్యే కొద్దీ సౌదీ భారత్కు దగ్గరవుతోంది. ఇప్పటికే భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా గతేడాది రిలయన్స్లో వాటాలు కొనుగోలు చేసింది. ఈ పరిస్థితుల్లో పాక్ మాటలు విని వివాదాల్లో ఇరుక్కొనే ఉద్దేశం ఎంబీఎస్కు లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!