ఆస్పత్రులకు ఆక్సిజన్.. రెమ్డెసివర్ పంపండి
ఆస్పత్రులకు తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డెసివర్ ఇంజక్షన్లు, వెంటిలేటర్లు, మరిన్ని
న్యూదిల్లీ: ఆస్పత్రులకు తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డెసివర్ ఇంజక్షన్లు, వెంటిలేటర్లు, మరిన్ని వ్యాక్సిన్ డోస్లను పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాలు కోరాయి. దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, దిల్లీ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీగా నమోదవుతున్న కరోనా కేసుల వివరాలను ఆయా రాష్ట్రాలు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు హర్షవర్ధన్ తెలిపారు. ‘అత్యధిక రాష్ట్రాలు ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీర్చాలని కోరాయి. అదేవిధంగా రెమ్డెసివర్ ఇంజక్షన్ అందుబాటులోకి ఉంచమన్నాయి. మహారాష్ట్రలో డబుల్ మ్యూటెంట్పై ప్రధానంగా చర్చజరిగింది. అదనపు పడకలను ఏర్పాటు చేయాలని దిల్లీ కోరింది’ అని హర్షవర్ధన్ సమావేశ వివరాలను వెల్లడించారు.
రాష్ట్రాలు కూడా కొవిడ్ ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని హర్షవర్ధన్ సూచించారు. ఇప్పటికే రాష్ట్రాల వద్ద 1.58 కోట్ల వ్యాక్సిన్ డోస్లు ఉన్నాయని, ఇంకా 1.16 కోట్ల డోస్లను అందుబాటులోకి తెస్తామన్నారు. చిన్న రాష్ట్రాలు ప్రతి ఏడు రోజులకు, పెద్ద రాష్ట్రాలు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి వ్యాక్సిన్ నిల్వలను సమీక్షించుకోవాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా రాష్ట్రాల వైద్య అవసరాలను తీరుస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈ సందర్భంగా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక