విభజిత రాష్ట్రంలో రిజర్వేషన్ ప్రయోజనాలుండవా?
ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్ పొందిన షెడ్యూల్ కులాలకు చెందిన ఓ వ్యక్తి విభజన తర్వాత ఏర్పాటైన రాష్ట్రంలో తన కోటా ప్రయోజనాలను కోల్పోతారా?..
సుప్రీంకోర్టులో విచారణ
దిల్లీ: ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్ పొందిన షెడ్యూల్ కులాలకు చెందిన ఓ వ్యక్తి విభజన తర్వాత ఏర్పాటైన రాష్ట్రంలో తన కోటా ప్రయోజనాలను కోల్పోతారా? - ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇలాంటి ప్రశ్న తొలిసారి తమ ముందుకి వచ్చినట్లు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అజయ్ రస్తోగీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి ఉదంతం ఎక్కడైనా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని విచారించనున్నట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో సహకరించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ని అడిగింది. ఝార్ఖండ్ హైకోర్టు గత ఏడాది ఫిబ్రవరి 24న ఇచ్చిన ఓ తీర్పును సవాల్ చేస్తూ పంకజ్ కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో అపీల్ దాఖలు చేశారు. ఆయన బిహార్, ఝార్ఖండ్ రెండు రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్ ప్రయోజనాలను పొందలేరంటూ హైకోర్టు అప్పట్లో 2:1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారంపై విచారణ సందర్భంగా ఝార్ఖండ్ అదనపు ఏజీ అరుణభ్ చౌధురి సుప్రీంకోర్టుకు తన వాదనలను వినిపించారు. హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నట్లు చెప్పారు. విచారణ గురువారం కూడా కొనసాగనుంది.
క్లాట్ అభ్యర్థుల వ్యాక్సినేషన్పై..
కామన్ లా అడ్మిషన్ పరీక్ష (క్లాట్) - 2021కి హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని పట్టుపట్టొద్దని సుప్రీంకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈనెల 23న నిర్వహిస్తున్న ఈ పరీక్షను ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని జస్టిస్ ఎల్.ఎన్.రావు, జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
దేశంలోని జాతీయ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు గాను ‘క్లాట్’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అండర్ గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి గాను ఈ పరీక్ష నిర్వహణకు జూన్ 14న జాతీయ లా యూనివర్సిటీల కన్సార్షియమ్ ఇచ్చిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. ‘క్లాట్’ నోటిఫికేషన్లో.. పెన్-పేపర్ విధానంలో అనేక కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు వ్యాక్సినేషన్ పూర్తిచేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థుల్లో చాలామంది 18 ఏళ్ల లోపు వారున్నారని, వారు వ్యాక్సిన్ వేయించుకోవడం సాధ్యం కాదని పిటిషనర్ల తరఫున హాజరైన న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. అలాగే కొవిడ్ నిబంధనలు అమలవుతున్న ప్రాంతాల్లో నివాసం ఉండే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం కూడా కష్టమవుతుందని వాదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ అంటే బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు