Covishield: కొవిషీల్డ్తో 93శాతం రక్షణ..!
కరోనా వైరస్ నుంచి కొవిషీల్డ్ వ్యాక్సిన్ 93శాతం రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా మరణాలు సంభవించే ప్రమాదాన్ని 98శాతం తగ్గిస్తోన్నట్లు తెలిపింది.
మరణం ముప్పు 98శాతం తగ్గిందన్న తాజా అధ్యయనం
దిల్లీ: కరోనా వైరస్ నుంచి కొవిషీల్డ్ వ్యాక్సిన్ 93శాతం రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా మరణాలు సంభవించే ప్రమాదాన్ని 98శాతం తగ్గిస్తోన్నట్లు తెలిపింది. సెకండ్ వేవ్కు కారణమైన డెల్టా వేరియంట్ విజృంభిస్తోన్న సమయంలో కొవిషీల్డ్ ప్రభావంపై దేశవ్యాప్తంగా 15లక్షల మంది వైద్యులు, ఫ్రంట్లైన్ వర్కర్లపై ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (AFMC) జరిపిన అధ్యయన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కరోనా సెకండ్ వేవ్ సమయంలో వైరస్ నుంచి 93శాతం రక్షణ పొందినట్లు నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యులు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 98శాతం మందికి మరణం ముప్పు తగ్గిందని పేర్కొన్నారు. కొవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకకుండా వ్యాక్సిన్లు 100శాతం రక్షణ కల్పించనప్పటికీ వైరస్ తీవ్రతను తగ్గించడంలో వ్యాక్సిన్ల ప్రభావం ఏమేరకు ఉందనే విషయం తాజా అధ్యయనం తెలియజేస్తోందని వీకే పాల్ అభిప్రాయపడ్డారు.
‘ఇన్ఫెక్షన్ సోకదని ఏ వ్యాక్సిన్ కూడా 100శాతం గ్యారంటీ ఇవ్వలేదు. కానీ, తీవ్ర అనారోగ్యం బారినపడకుండా నిర్మూలించగలుగుతాయి. అందుచేత వ్యాక్సిన్లపై నమ్మకం ఉంచడంతో పాటు అప్రమత్తంగా ఉంటూ అత్యంత జాగ్రత్తగా వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని వీకే పాల్ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 44కోట్ల 19లక్షల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న మొత్తం జనాభాలో 9.9కోట్ల మందికి పూర్తిస్థాయిలో (రెండు డోసులు) ఇచ్చినట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.