Elon Musk: మీరు ఆకలి మంటల్ని చల్లార్చగలరా..అయితే ఆ డబ్బు నేనిస్తా..!
తన కంపెనీలు, డిజిటల్ కరెన్సీ గురించి తరచూ మాట్లాడే ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తాజాగా ట్విటర్ వేదికగా ఐరాసకు సవాలు విసిరారు. ఆకలి సమస్యను ఎదుర్కొవడానికి సరైన ప్రణాళిక వివరిస్తే.. ఇప్పటికిప్పుడే టెస్లాలోని తన షేర్లు అమ్మేసి, డబ్బు ఇచ్చేస్తానని వ్యాఖ్యానించారు.
ఐరాస విభాగానికి మస్క్ సవాలు..
ఆయనకు అర్థమయ్యేలా వివరించిన డబ్ల్యూఎఫ్పీ
వాషింగ్టన్: తన కంపెనీలు, డిజిటల్ కరెన్సీ గురించి తరచూ మాట్లాడే ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తాజాగా ట్విటర్ వేదికగా ఐరాసకు సవాలు విసిరారు. ఆకలి సమస్యను ఎదుర్కొవడానికి సరైన ప్రణాళిక వివరిస్తే.. ఇప్పటికిప్పుడే టెస్లాలోని తన షేర్లు అమ్మేసి, డబ్బు ఇచ్చేస్తానని వ్యాఖ్యానించారు. ప్రపంచ సంపన్నులు జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ వంటివారు తన సంపదలో స్వల్ప మొత్తాన్ని ఇవ్వడం ద్వారా ఆకలి సమస్యను పరిష్కరించవచ్చని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యూఎఫ్పీ)కి చెందిన డేవిడ్ బెస్లీ ఇటీవల మీడియాతో అభిప్రాయపడ్డారు. బెస్లీ వ్యాఖ్యలపై స్పందించిన మస్క్..‘ప్రపంచం ఎదుర్కొంటోన్న ఆకలి సమస్యను 6 బిలియన్ల డాలర్లతో ఎలా తీర్చవచ్చో ఈ ట్విటర్ వేదికగా డబ్ల్యూఎఫ్పీ వివరించగలిగితే.. నేనిప్పుడే టెస్లా స్టాక్ను అమ్మేసి, డబ్బు ఇచ్చేస్తాను’ అని ట్వీట్ చేశారు.
అఫ్గాన్ వంటి దేశాలు తీవ్రమైన ఆకలి, నిరుద్యోగం, ఆర్థిక మందగమనం కారణంగా సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నాయని.. గ్వాటెమాల, హోండురాస్, నికరాగ్వా తదితర దేశాలు తుపానులు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమయ్యాయని బెస్లీ ఇటీవల మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఆదుకోని పక్షంలో దాదాపు 4.20 కోట్ల మంది చనిపోయే ప్రమాదం ఉందన్నారు. వారిని కాపాడుకునేందుకు 6 బిలియన్ల డాలర్లు అవసరం అవుతాయని చెప్పారు. మస్క్ నికర సంపదలో ఇది స్వల్పమొత్తమేనని పేర్కొన్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్. ఆయన నికర సంపద విలువ 300 బిలియన్ల డాలర్లు. దానిలో రెండు శాతమే ఈ మొత్తం. కాగా, మస్క్ వ్యాఖ్యలకు బెస్లీ బదులిచ్చారు. ఈ ఆరు బిలియన్ల డాలర్లు ఆహార సంక్షోభాన్ని తీర్చడానికి సరిపోతాయని తామెప్పుడూ చెప్పలేదని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో 4.20 కోట్ల మంది ఆకలి తీర్చేందుకు ఈ మొత్తం ఉపకరిస్తుందని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం