Varun Singh: ప్రాణాలతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. రెండు నెలల కిందటి లేఖ వైరల్..!
‘మీరు యావరేజ్ విద్యార్థి అయినా పర్వాలేదు.. జీవితంలో మీకు ఎదురయ్యే సవాళ్లకు అది కొలమానం కాదు. మీ లక్ష్యం ఏంటో గుర్తించండి. దేని కోసం పనిచేసినా.. మీ వంతు కృషి చేయండి. ఎప్పుడూ ఆశను మాత్రం వీడకండి’..
దిల్లీ: ‘మీరు యావరేజ్ విద్యార్థి అయినా పర్వాలేదు.. జీవితంలో మీకు ఎదురయ్యే సవాళ్లకు అది కొలమానం కాదు. మీ లక్ష్యం ఏంటో గుర్తించండి. దేని కోసం పనిచేసినా.. మీ వంతు కృషి చేయండి. ఎప్పుడూ ఆశను మాత్రం వీడకండి’.. జీవించాలనే ఆశతో మృత్యువుతో వీరోచితంగా పోరాడుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మనసు నుంచి వచ్చిన స్ఫూర్తిదాయక పదాలివి. ఎంచుకున్న వృత్తిలో రాణించేవరకు ఆయన కూడా సాధారణ విద్యార్థే. చెప్పుకోదగ్గ మార్కులేం రాలేదట. ఇవే మాటలు చెప్తూ.. తాను చదివిన హరియాణాలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్కు సెప్టెంబర్లో వరుణ్ లేఖ రాశారు. తాము సాధారణం అని భావించే విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకే ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. తమిళనాడులో హెలికాఫ్టర్ దుర్ఘటన సమయంలో ఈ లేఖ ప్రస్తుతం వైరల్గా మారింది.
‘నేను చదువులో చాలా సాధారణ విద్యార్థిని. 12వ తరగతిలో ఫస్ట్ డివిజన్ మాత్రమే పొందాను. చదువొక్కటే కాదు.. ఆటలు, ఇతర కార్యక్రమాల్లో కూడా అంత చురుగ్గా ఉండేవాడిని కాదు. కానీ, నాకు విమానాలు, విమాయానం గురించి తెలుసుకోవాలని మాత్రం ఆసక్తి ఉండేది. అయితే నేను సాధారణ వ్యక్తిని.. గొప్పగా చేయాలని ప్రయత్నించడంలో అర్థం లేదనే న్యూనతతో ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే ఫ్లైట్ స్క్వాడ్రన్లో యంగ్ ఫ్లైట్ లెఫ్టినెంట్గా ఎంపికయ్యానో.. అప్పటి నుంచి నా ఆలోచన మారింది. నేను మనస్సు పెట్టి పనిచేస్తే.. గొప్పగా పనిచేయగలనని అర్థమైంది. అంతే వృత్తిగత, వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు మొదలయ్యాయి’ అంటూ వరుణ్ తన అనుభవాలను వివరించారు.
అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఛాలెంజింగ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్స్ కోర్సులో రెండు ట్రోఫీలను గెలుచుకున్నారు. కఠినమైన ప్రయోగాత్మక టెస్ట్ పైలట్ కోర్సుకు ఎంపికయ్యారు. చివరకు, ఆయన సీనియారిటీ మార్కు దాటనప్పటికీ, తేజస్ ఫైటర్ స్క్వాడ్రన్లో పోస్టింగ్ పొందారు. ఆయన విజయాలు అక్కడితో ఆగలేదు. ఇస్రో చరిత్రలో మేకింగ్ గగన్యాన్ ప్రొగ్రామ్ కోసం 12 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో కూడా చోటుదక్కించుకున్నారు. తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలతో తాను వెనకడుగు వేయాల్సి వచ్చిందని తన లేఖలో పేర్కొన్నారు. ‘జీవితంలో నువ్వు సాధించే విజయాలను 12వ తరగతిలో వచ్చే మార్కులు నిర్ణయిస్తాయని అనుకోవద్దు. నిన్ను నువ్వు నమ్ము. ఆ దిశగా పని చేయి’ అంటూ తన లేఖను ముగించారు.
డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ దుర్ఘటనలో వరుణ్ సింగ్ మినహా మిగతా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి కూడా ఉన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రిలో వరుణ్ చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అధికారిక వర్గాల సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!