Ram Nath Kovind: బంగ్లాదేశ్లో చారిత్రక కాళీ మందిరాన్ని ప్రారంభించిన భారత రాష్ట్రపతి
1971 లిబరేషన్ వార్లో ధ్వంసమైన బంగ్లాదేశ్లోని చారిత్రక శ్రీ రమ్నా కాళీ మందిరాన్ని పునఃనిర్మించగా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం ప్రారంభించారు......
ఢాకా: బంగ్లాదేశ్లో పునర్నిర్మించిన చారిత్రక శ్రీ రమ్నా కాళీ మందిరాన్ని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం ప్రారంభించారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి.. చివరిరోజైన మూడో రోజు రాజధాని ఢాకాలోని ఈ చారిత్రక ఆలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన సతీమణి సవితా కోవింద్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్-బంగ్లాదేశ్ ప్రజల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధానికి చిహ్నంగా ఈ ఆలయం నిలుస్తుందని అభివర్ణించారు. భారత్ సాయంతో ఈ ఆలయాన్ని పునఃనిర్మించడం ఆనందంగా ఉందన్నారు.
1971 లిబరేషన్ వార్లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన అనంతరం ప్రతి ఏటా బంగ్లాలో ‘విజయ్ దివస్’ను నిర్వహిస్తారు. స్వాతంత్ర్యం పొంది ఈ ఏడాదికి 50 ఏళ్లు కావడంతో దేశవ్యాప్తంగా ‘గోల్డెన్ జూబ్లీ’ సంబురాలు జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వేడుకల్లో పాల్గొనాలని బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ నుంచి భారత్కు ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం మేరకు మూడు రోజులుగా రాష్ట్రపతి బంగ్లాలో పర్యటిస్తున్నారు.
హిందూ ఆలయాలే లక్ష్యంగా 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ బలగాలు శ్రీ రమ్నా కాళీ మందిరాన్ని ధ్వంసం చేశాయి. ‘ఆపరేషన్ సెర్చ్లైట్’ పేరుతో పాకిస్థానీ సైన్యం చేపట్టిన ఆపరేషన్లో గుడిని పూర్తిగా ధ్వంసం చేసి, నిప్పంటించాయి. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భక్తులతోపాటు అక్కడ ఆశ్రయం పొందిన దాదాపు వెయ్యి మంది మృతిచెందారు. ప్రస్తుతం ఈ ఆలయ పునఃనిర్మాణాకి భారత్ చేయూతనందించింది. ముస్లిం మెజారిటీ బంగ్లాదేశ్లో 16.9 కోట్ల జనాభా ఉండగా.. అందులో హిందువులు దాదాపు 10 శాతం ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక