Afghan crisis: ఉగ్రదాడి ముప్పు పొంచి ఉంది.. అక్కడి నుంచి వెళ్లిపోండి..!
ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందని, వెంటనే కాబుల్ విమానాశ్రయ పరిసర ప్రాంతాలను వీడండంటూ గురువారం అమెరికా, సహా పలు పాశ్చాత్య దేశాలు తమ ప్రజలను కోరాయి. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయగా.. తమ పౌరుల భద్రత గురించి పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కాబుల్ విమానాశ్రయం ఖాళీ చేయాలని తమ పౌరుల్ని కోరిన దేశాలు
కాబుల్: ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందని, వెంటనే కాబుల్ విమానాశ్రయ పరిసర ప్రాంతాలను వీడండంటూ గురువారం అమెరికా, సహా పలు పాశ్చాత్య దేశాలు తమ ప్రజలను కోరాయి. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. తమ పౌరుల భద్రత గురించి పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం అఫ్గానిస్థాన్ తాలిబన్ల వశమైంది. దాంతో అక్కడి నుంచి తమ పౌరులు, సైనిక సిబ్బంది, శరణార్థుల తరలింపు ప్రక్రియను పశ్చిమ దేశాలు వేగవంతం చేస్తున్నాయి. ఆగస్టు 31 నాటికి బలగాల ఉపసంహరణ గడువుకు ముందు సాధ్యమైనంత ఎక్కువ మందిని తరలించాలని చూస్తుండటంతో.. భారీగా ప్రజలు కాబుల్ విమానాశ్రయ సమీపంలో గుమిగూడుతున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
‘భద్రతా కారణాల దృష్ట్యా విమానాశ్రయం సమీపంలో ఉన్నవారంతా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలి’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తమ పౌరులను హెచ్చరించింది. ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందని ఆస్ట్రేలియా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విమానాశ్రయం వద్దకు వెళ్లొద్దని తమ ప్రజలకు సూచించింది. ‘ఇతర మార్గాల ద్వారా అఫ్గానిస్థాన్ నుంచి సురక్షితంగా బయటపడగలిగితే.. వెంటనే ఆ పని చేయండి’ అంటూ బ్రిటన్ తన పౌరులను అప్రమత్తం చేసింది. అఫ్గానిస్థాన్ నుంచి తరలివెళ్లే ఉద్దేశంతో సుమారు 10 వేల మందికిపైగా ప్రజలు కాబుల్ విమానాశ్రయంలో వేచిచూస్తున్నారని యూఎస్ ఆర్మీ మేజర్ జనరల్ విలియం టేలర్ మీడియాకు వెల్లడించారు. ఆ తరుణంలోనే పలు దేశాల నుంచి ఈ హెచ్చరికలు వెలువడ్డాయి.
ఇదిలా ఉండగా.. 24 గంటల వ్యవధిలో 19వేల మందిని తరలించినట్లు పెంటాగన్ పేర్కొంది. అలాగే ఇప్పటి వరకు 80 వేల మందికి పైగా విదేశీయులు, అఫ్గాన్ వాసుల్ని తరలించినట్లు చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి