WHO chief in Afghan: అఫ్గాన్ పర్యటనలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్!
అఫ్గాన్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం అత్యంత ప్రధానాంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనమ్ గెబ్రెయేసస్ అఫ్గాన్ పర్యటన చేపట్టారు.
తాలిబన్ ప్రతినిధులతో భేటీ కానున్న టెడ్రోస్
కాబుల్: అమెరికా బలగాల ఉపసంహరణ, తాలిబన్ల హస్తగతం తర్వాత అఫ్గానిస్థాన్ తీవ్ర సంక్షోభంలోకి జారుకున్న విషయం తెలిసిందే. తాజాగా నెలకొన్న పరిస్థితులు అఫ్గాన్ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా నిధులు, నిర్వహణ లేమితో వందల సంఖ్యలో వైద్య, ఆరోగ్య కేంద్రాలు పూర్తిగా మూతపడుతున్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గాన్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం అత్యంత ప్రధానాంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనమ్ గెబ్రెయేసస్ అఫ్గాన్ పర్యటన చేపట్టారు. అక్కడ వైద్య, ఆరోగ్య సేవలను పర్యవేక్షించడంతో పాటు తాలిబన్ నాయకత్వంతోనూ సమావేశం కానున్నట్లు వెల్లడించారు.
తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్ ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ నేరుగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా సోమవారం కాబుల్ చేరుకున్న టెడ్రోస్.. ఆరోగ్య సంరక్షణ సేవలను పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా తాలిబన్ల ప్రతినిధులతోనూ భేటీ అవుతానన్నారు. ముఖ్యంగా అఫ్గాన్లో ఆరోగ్య విభాగానికి ప్రపంచ బ్యాంకు అందించే నిధులను నిలిపివేయడంపై ఆయా అధికారులతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరిగి ఆ నిధులను విడుదల చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్లు అఫ్గాన్ ఆరోగ్య మంత్రిగా ఉన్న వాహిద్ మజ్రూహ్ పేర్కొన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అంతేకాకుండా అఫ్గాన్ ప్రధానమంత్రి ముల్లా హసన్ అఖుంద్, ఉప ప్రధాని ముల్లా బరాదర్లతోనూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ భేటీ అవుతారని వెల్లడించారు.
అఫ్గాన్లో నెలకొన్న సంక్షోభంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోయింది. దేశవ్యాప్తంగా 2300 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఈ వారం రోజుల్లోనే 90శాతం మూతపడే ప్రమాదం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ ప్రతినిధి రిక్ బ్రెన్నన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీటిలో దాదాపు 500 కేంద్రాలకు వైద్య పరికరాలు, ఔషధాల సరఫరాతో పాటు నిధులను కూడా అందించేందుకు డబ్ల్యూహెచ్ఓ కృషి చేస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ అఫ్గాన్ పర్యటన చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.