Atiq Ahmed: అతీక్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం: ఆల్‌ఖైదా

గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmed) హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా హెచ్చరించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో అతీక్‌ సోదరులను అమవీరులుగా అభివర్ణించింది. 

Published : 22 Apr 2023 00:07 IST

దిల్లీ: ఉత్తర్‌ ప్రదేశ్‌ (Uttar Pradesh) పోలీసుల కస్టడీలో అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmed) సోదరులు హత్యకు గురైన నేపథ్యంలో భారత్‌లో దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా హెచ్చరించింది. ఈ మేరకు ఆల్‌ఖైదా మీడియా విభాగం ఏడు పేజీల పత్రికను విడుదల చేసింది. అందులో అతీక్‌ సోదరులను అమరవీరులుగా అభివర్ణించింది. అతీక్‌ సోదరుల హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది. పోలీసుల విచారణలో తనకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు అతీక్‌ అహ్మద్‌ చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆల్‌ఖైదా ప్రకటన చర్చనీయాంశమైంది. 

ఉతర్త్‌ ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఉమేశ్‌ పాల్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ జైలు నుంచి మెడికల్‌ చెకప్‌ కోసం తీసుకెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు జర్నలిస్టుల్లా వచ్చి వారిపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే వారు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు అతీక్‌ కుమారుడు అసద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఉమేశ్ పాల్ హత్య కేసులో విచారణ నిమిత్తం అతీక్‌ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్‌ కోర్టులో హాజరుపర్చారు. అదే సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ చేసుకోగా.. తాజాగా అతీక్‌ ఆహ్మద్‌ హత్యకు గురవ్వడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని