ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియన్‌ జిల్లా బడిగామ్‌ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారం మేరకు కశ్మీర్‌ పోలీసులతో కలిసి సైన్యం ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించింది....

Updated : 19 Feb 2021 11:45 IST

మరో ఘటనలో ఎస్పీ వీరమరణం

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియన్‌ జిల్లా బుద్గామ్‌ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారం మేరకు కశ్మీర్‌ పోలీసులతో కలిసి సైన్యం ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించింది. ఈ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా తప్పించుకునే క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సైనికాధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఆ ప్రాంతంలో తనిఖీలు వెల్లడించారు. ఉద్ఘావ్‌లో జరిగిన మరో ఎదురుకాల్పుల ఘటనలో ఎస్పీ ప్రాణాలు కోల్పోగా మరో జవాను గాయపడినట్లు అధికారులు తెలిపారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని