ట్రంప్కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణం కార్యక్రమం పూర్తయింది. తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వైట్ హౌస్ నుంచి ఫ్లోరిడాలోని తన సొంత రిసార్టు.
ఇంటర్నెట్ డెస్క్: యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణం కార్యక్రమం పూర్తయింది. తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వైట్ హౌస్ నుంచి ఫ్లోరిడాలోని తన సొంత రిసార్టు వెళ్లారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలు ఆయన స్థాయిని పెంచితే.. మరికొన్ని అధ్యక్ష పదవికి ఆయన అనర్హుడనే పేరును తెచ్చాయి. ఏదేమైనప్పటికీ పదవీ కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను సమర్థించిన వారికంటే వ్యతిరేకించిన వారే ఎక్కువ. ముఖ్యంగా వీసా విధానంపై ఆయన తీసుకున్న నిర్ణయాలను గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజ సంస్థలు వ్యతిరేకించి కోర్టు మెట్లెక్కాయి. మరి అంతలా వ్యతిరేకించిన వాళ్లు ట్రంప్కు బహుమతులు ఇచ్చారంటే నమ్ముతారా? అయినా నిజం.. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నకాలంలో ట్రంప్కు యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఒక గిఫ్ట్ ఇచ్చారంట. ఈ విషయాన్ని ట్రంప్ తన ఫైనాన్షియల్ రిపోర్ట్లో పేర్కొన్నారు.
యాపిల్ సీఈవో టిమ్ కుక్ నుంచి 5,999 డాలర్లు విలువ చేసే మాక్ ప్రో కంప్యూటర్ను బహుమతిగా అందుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీన్ని టెక్సాస్ రాజధాని ఆస్టిన్లో ఉన్న యాపిల్ ఫ్లెక్స్ ఫ్యాక్టరీలో తయారుచేసినట్లు అందులో పేర్కొన్నారు. అయితే దీన్ని ట్రంప్కు టిమ్ ఎప్పుడు బహూకరించారనేది మాత్రం ప్రస్తావించలేదు. యాపిల్ కంపెనీతో పాటు బోయింగ్, ఫోర్డ్ కంపెనీలు కూడా ట్రంప్కు బహుమతులు ఇచ్చాయి. ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బిల్ ఫోర్డ్ ఒక లెదర్ జాకెట్, బోయింగ్ ప్రెసిడెంట్ డెన్నిస్ ములెన్బర్గ్ కస్టమైజ్డ్ గోల్ఫ్ క్లబ్ను బహుమతిగా ఇచ్చారట. అయితే ట్రంప్కు వచ్చిన బహుమతుల్లో అత్యంత ఖరీదైనది మాత్రం కాంస్యంతో తయారు చేసిన యుఎస్ మెరైన్స్ విగ్రహం. దీన్ని గ్రేటెస్ట్ జనరేషన్స్ ఫౌండేషన్ సీఈవో తిమోతి డేవిస్ బహూకరించారట. దీని విలువ 25,970 డాలర్లు. ఇవే కాకుండా ఛాంపియన్షిప్ బెల్ట్, నేషనల్ మెమోరియల్ కాంస్య విగ్రహం, గోల్ఫ్ క్లబ్ కవర్, చేతి గ్లోజ్, గోల్ఫ్ బ్యాగ్, గొడుగు అధ్యక్షుడిగా ట్రంప్ అందుకున్న బహుమతుల జాబితాలో ఉన్నాయి.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.