China Vs Taiwan: తైవాన్ను డ్రాగన్ ముట్టకుండా తెరపైకి ‘పాయిజన్ ఫ్రాగ్’
చిక్కటి అడవుల్లో ఆకర్షణీయమైన రంగుల్లో కనిపించే విషపూరిత కప్పను ఏ పాము అయినా నోట పట్టిందా.. ఆ రోజుతో పాముకు భూమిపై నూకలు చెల్లిపోతాయి..
ఆ దేశ ద్వీపాలను రక్షించడానికి అమెరికా వ్యూహ సంస్థల కసరత్తు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చిక్కటి అడవుల్లో ఆకర్షణీయమైన రంగుల్లో కనిపించే విషపూరిత కప్పను ఏ పాము అయినా నోట పట్టిందా.. ఆ రోజుతో పాముకు భూమిపై నూకలు చెల్లిపోతాయి. అచ్చం ఇలానే తైవాన్ను అత్యంత దుర్భేద్యంగా మార్చేయాలని అమెరికా వ్యూహ రచన చేస్తోంది. ఇటీవల జో బైడెన్ మాట్లాడుతూ తైవాన్ రక్షణకు తాము జోక్యం చేసుకొంటామని నోరుజారారు. వాస్తవానికి అమెరికా పాలసీకి ఇది విరుద్ధం. అమెరికా వైఖరి బహిర్గతమైతే చైనా అప్రమత్తమై మరిన్ని జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉంది. అప్పుడు తైవాన్ను రక్షించడం మరింత కష్టమైపోతుంది. అందుకే వెంటనే శ్వేతసౌధం ప్రతినిధి జెన్సాకి మళ్లీ ప్రెస్మీట్ ఏర్పాటు చేసి ‘వన్ చైనా పాలసీ’కి కట్టుబడే విషయంలో తమ వైఖరి మారలేదని పేర్కొన్నారు. తైవాన్ రక్షణ విషయంలో అమెరికాకు అతితక్కువ అవకాశాలు ఉన్నట్లు ఇటీవల తేలింది. దీంతో చైనా ఏ మాత్రం దుస్సాహసం చేసినా.. ఆ తర్వాత పరిణమాలను భరించలేక వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి తీసుకురావాలని అమెరికా వ్యూహకర్తలు చెబుతున్నారు. ఇందుకోసం వారు ‘ది పాయిజన్ ఫ్రాగ్’ వ్యూహం ఉత్తమమని సూచిస్తున్నారు.
డాంగ్షా ద్వీపంపై చైనా కన్ను
ఇటీవల తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి చైనా యుద్ధవిమానాలు పదుల సంఖ్యలో చొరబడుతున్నాయి. చైనా తొలుత డాంగ్షా ద్వీపం, ప్రాతాస్ ద్వీపాన్ని ఆక్రమించాలని కుయుక్తులు పన్నుతోంది. ఈ రెండు ద్వీపాలు తైవాన్లో భాగం. వీటిల్లో తొలిదాడి డాంగ్షాపై జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కేవలం 500 మంది తైవాన్ భద్రతా సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. చైనా అధీనంలోని హాంకాంగ్ నుంచి ఇది 190 మైళ్ల దూరంలో ఉండగా.. తైవాన్కు 275 మైళ్ల దూరంలో ఉంది.
ఇటీవల చైనా ఒక దీవిని ఆక్రమించేందుకు వీలుగా సైనికులతో సాధన చేయిస్తున్న విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏ దాడి నుంచి అయినా తైవాన్ను రక్షించేందుకు వీలుగా సమీపంలో అమెరికాకు చెందిన యుద్ధనౌకలు, సబ్మెరైన్లు తగినన్ని లేవు. తైవాన్ చిన్న దేశం కావడం.. పెద్ద దేశాల నుంచి దానికి గుర్తింపు లేకపోవడం వంటి కారణాలతో తైవాన్ రక్షణ అమెరికాకు కష్టం కానుంది. ఈ విషయం ఇటీవల వాషింగ్టన్లోని సీఎన్ఏస్ (సెంటర్ ఫర్ న్యూ అమెరికా సెక్యూరిటీ) సంస్థ ‘వార్గేమింగ్ ల్యాబ్’లో చేసిన ప్రయోగాల్లో ఊహించని లోపాలు బయటపడ్డాయి. తైవాన్ను రక్షించే క్రమంలో అమెరికాకు చాలా సమస్యలు తలెత్తనున్నట్లు తేలింది. తైవాన్-అమెరికా సైన్యాల మధ్య కమ్యూనికేషన్లు కూడా సక్రమంగా ఉండే అవకాశం లేదని తెలిసింది. అమెరికాకు చాలా పరిమిత ఆప్షన్లు మాత్రమే ఉన్నట్లు ఈ వార్గేమ్స్లో బయటపడింది.
తెరపైకి కొత్త వ్యూహం..
డాంగ్షా ద్వీపంలో చదునైన భూభాగం ఉండటంతో ఆక్రమణల నుంచి రక్షించడం కష్టం. డాంగ్షా ద్వీపాన్ని ఆక్రమిస్తే ప్రాదేశిక జలాలు, ఎక్స్క్ల్యూజివ్ ఎకనమిక్ జోన్లతో దక్షిణ చైనా సముద్రంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నావికాదళం పట్టు బిగుస్తుంది. తైవాన్ రక్షణకు వచ్చే దేశాల నౌకలను అడ్డుకోవడం తేలిగ్గా మారుతుంది. ఫలితంగా తైవాన్ ఆక్రమణ సులువు అవుతుంది. గతేడాది చైనా డ్రోన్లు తరచూ ఈ ద్వీపం వద్దకు రావడంతో.. వాటిని కూల్చేస్తామని తైవాన్ హెచ్చరికలు కూడా జారీ చేసింది.
ఈ నేపథ్యంలో డాంగ్షా, ప్రతాస్ వంటి చిన్న ద్వీపాలను వీలైనంత దుర్లభంగా మార్చేసి రక్షించాలని అమెరికా భావిస్తోంది. సెంటర్ ఫర్ న్యూ అమెరికా సెక్యూరిటీ వ్యూహాకర్తలు అభిప్రాయం ప్రకారం.. డ్రాగన్ మింగటానికి వీలుకాని ‘విషపూరిత కప్ప’వలే తైవాన్ ద్వీపాలను మార్చాలని సూచించారు. ఇప్పటికే అమెరికా సైనికులు రహస్యంగా తైవాన్లో భద్రతా దళాలకు శిక్షణ ఇవ్వడం ఈ వ్యూహానికి బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు సైనికపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా చైనా భరించలేనంత మూల్యం చెల్లించేలా సిద్ధం చేయాలని వ్యూహకర్తలు సూచించారు. వీటిల్లో చైనాపై ఆర్థిక, రాజకీయ ఆంక్షలు విధించడం వంటివి కూడా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం