US Visa: వీసా రెన్యువల్కు నో మెయిల్.. ఓన్లీ డ్రాప్ బాక్స్!
యూఎస్ వీసా (US Visa) రెన్యువల్ చేయాలను కునేవారు డ్రాప్ బాక్స్ (Drop Box) ద్వారా దరఖాస్తులు సమర్పించాలని, మెయిల్స్ ద్వరా వచ్చిన దరఖాస్తులను స్వీకరించబోమని భారత్లోని అమెరికా దౌత్యకార్యాలయం వెల్లడించింది.
ముంబయి: అమెరికా (USA) వీసా రెన్యువల్ చేయాలనుకునేవారు డ్రాప్బాక్స్ (Drop Box) ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని భారత్లోని అమెరికా దౌత్యకార్యాలయం (US Embassy) ప్రకటిచింది. మెయిల్స్ ద్వారా వీసా రెన్యువల్ చేయడాన్ని స్వాగతించబోమని తెలిపింది. ఈ మేరకు అభ్యర్థుల ప్రశ్నకు బదులిచ్చింది. మరోవైపు ఈ ఏడాదిలో భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు మంజూరు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ముంబయిలో యూఎస్ కాన్సులేట్ జనరల్ జాన్ బల్లార్డ్ వెల్లడించారు. ‘‘యూఎస్ వీసాల కోసం ఈ ఏడాది భారత్ నుంచి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నాం. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం.’’ అని జాన్ బల్లార్డ్ తెలిపారు. 2022లో 1,25,000 విద్యార్థి వీసాలను మంజూరు చేసినట్లు ఆయన గుర్తు చేశారు.
వీసా మంజూరు, రెన్యువల్కు పడుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సిబ్బందిని పెంచడంతో పాటు ‘డ్రాప్ బాక్స్’ విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు. డ్రాప్ బాక్స్ విధానంలో.. ఇంటర్వ్యూ లేకుండా వీసా రెన్యువల్కు దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేళ్లుగా అమెరికా వీసా ఉన్నవారు ఇందుకు అర్హులు. వెల్లువెత్తుతున్న వీసా దరఖాస్తులను దృష్టిలో ఉంచుకొని భారత్లోని యూఎస్ ఎంబసీ గత నెలలో ప్రత్యేక చర్యలు మొదలు పెట్టింది. మొదటిసారి వీసా దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహణతోపాటు నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా సిబ్బందిని పెంచుతోంది. ఇందులో భాగంగానే భారత్లోని కాన్సులేట్ కార్యకలాపాలను వేగవంతం చేసింది. దిల్లీలోని యూఎస్ ఎంబసీతోపాటు ముంబయి, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలోని కాన్సులేట్ కేంద్రాల్లోనూ ప్రతి శనివారం వీసా దరఖాస్తు దారులకు ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని జనవరి 21న లాంఛనంగా ప్రారంభించారు.
వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నామని యూఎస్ ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో పదుల సంఖ్యలో కాన్సులేట్ ఆఫీసర్లను తాత్కాలిక ప్రాతిపదికన భారత్కు తీసుకు రానున్నట్లు వెల్లడించింది. వీసా జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి