Mehul Choksi: ‘వలపు వలలో ఛోక్సీ..!’
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. రోజుకో వార్త వినిపిస్తోంది. ఆయనను
హనీట్రాప్తో కిడ్నాప్ అంటోన్న ఆయన సన్నిహిత వర్గాలు
ఇంటర్నెట్డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. రోజుకో వార్త వినిపిస్తోంది. ఆయనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఛోక్సీ న్యాయవాదులు ఆరోపిస్తుండగా.. లేదు లేదు గర్ల్ ఫ్రెండ్తో విందు కోసం వెళ్లి పోలీసులకు చిక్కాడని ఆంటిగ్వా ప్రధాని చెప్పారు. అయితే ఛోక్సీ వెంట అమ్మాయి ఉన్న మాట నిజమేగానీ, ఆమె ఆయన స్నేహితురాలు కాదట.. కిడ్నాప్ టీంలో ఆమె కూడా ఓ పాత్రధారి అట.. ఈ మేరకు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పినట్లు ఓ ఆంగ్ల మీడియా కథనం పేర్కొంది.
మార్నింగ్ వాక్లో హాలో చెప్పి..
ఛోక్సీ తన గర్ల్ఫ్రెండ్తో విందు కోసం.. ఆమెతో సరదాగా గడిపేందుకు బోటు ద్వారా డొమినికా చేరుకుని ఉంటాడని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ అమ్మాయి ఛోక్సీ స్నేహితురాలు కాదని తాజాగా ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఆంటిగ్వాకు చెందిన ఆ యువతి ఉదయం, సాయంత్రం వాకింగ్కు వెళ్లిన సమయంలో ఛోక్సీతో పరిచయం పెంచుకుని స్నేహం చేసిందని సదరు వర్గాలు చెప్పినట్లు సదరు మీడియా కథనం వెల్లడించింది. మే 23న ఆమె ఛోక్సీకి ఫోన్ చేసి తన అపార్ట్మెంట్కు రమ్మని పిలిచిందట. ఆయన అక్కడకు వెళ్లేసరికి కొంతమంది వ్యక్తులు తనను బలవంతంగా లాక్కెళ్లి బోటులో డొమినికా తీసుకెళ్లినట్లు సదరు వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత రెండో రోజులకు డొమినికా బీచ్లో ఛోక్సీని అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.
ఆసుపత్రికి తరలింపు..
మరోవైపు డొమినికా జైల్లో ఉన్న ఛోక్సీ ఫొటోలను ఆంటిగ్వా న్యూస్ రూం నిన్న విడుదల చేసింది. అందులో ఆయన చేతులు, కంటిపై గాయాలైనట్లు ఉన్నాయి. ఆయనను తీవ్రంగా కొట్టి ఉంటారని ఆయన న్యాయవాదులు ఆరోపించారు. దీనిపై వారు కోర్టుకు వెళ్లడంతో ఛోక్సీని ఆసుపత్రికి తరలించాలని అక్కడి న్యాయస్థానం ఆదేశించింది. దీంతో సోమవారం ఆయనను డొమినికా రాజధాని రొసెవులోని ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. నెగెటివ్గా నిర్ధారణ అయ్యింది.
భారత్కు పంపిస్తారా..
ఛోక్సీని భారత్కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఖతార్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానం దిల్లీ నుంచి డొమినికాకు వెళ్లింది. ఛోక్సీ అప్పగింతకు అవసరమైన పత్రాలు ఆ విమానంలో వచ్చాయని ఆంటిగ్వా ప్రధాని తెలిపారు. అయితే ఛోక్సీ కేసుపై డొమినికా కోర్టు జూన్ 2న విచారణ జరపనుంది. ఆయనను నేరుగా భారత్కు పంపాలా లేదా ఆంటిగ్వా పంపాలా అన్నదానిపై కోర్టు ఓ నిర్ణయానికి రానుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రూ. 13వేల కోట్లు ఎగవేసిన కేసులు ఛోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీ నిందితులుగా ఉన్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే ఛోక్సీ ఆంటిగ్వా పారిపోయాడు. అంతకు మునుపే అక్కడ పౌరసత్వం కూడా పొందాడు. ఛోక్సీపై ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీసు ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక