ఆ ద్వీపాలు విమానాలకు శాపమా..!
అది 1990 అక్టోబర్ 10.. బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్నెంబర్ 5390 .. గాల్లో 17,300 అడుగుల ఎత్తులో ఉండగానే కాక్పీట్
ఇండోనేషియాలోనే అత్యధిక ప్రమాదాలు ఎందుకు ?
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: అది 1990 అక్టోబర్ 10.. బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్నంబర్ 5390 .. గాల్లో 17,300 అడుగుల ఎత్తులో ఉండగానే కాక్పీట్ విండ్స్క్రీన్ ఒక్కసారిగా ఊడిపోయింది. గాలి ఒత్తిడి పైలట్ టిమోతీ లాంక్స్టర్ను బయటకు లాగేసింది. ఆయన కాళ్లు మాత్రం క్యాబిన్లో చిక్కుకుపోవడంతో శరీరం విమానానికి అతుక్కుపోయినట్లు ఉంది. కోపైలట్, క్రూ సభ్యులు చాకచక్యంగా వ్యహరించి టిమోతి కాళ్లను పట్టుకోవడంతో ఆయన కిందపడిపోలేదు. ఆ తర్వాత సహ పైలట్ విమానాన్ని సురక్షితంగా కిందకు దించాడు. ఈ విమానంలో 87మంది సురక్షితంగా బయటపడ్డారు. టిమోతి కూడా బతికారు. ఈ ప్రమాదానికి కారణం.. ఆ విమానం విండ్షీల్డ్కు రాత్రిపూట మరమ్మతులు చేసి ఒరిజనల్ బోల్టుల స్థానంలో పొరబాటున అత్యంత స్వల్పతేడా ఉన్న వేరే బోల్టులు అమర్చారు. ఈ ఘటన విమానయానంలో చిన్న పొరబాట్లు, నిర్లక్ష్యాలకు చెల్లించాల్సిన మూల్యాన్ని చెబుతోంది. పొరబాట్లు.. నిర్లక్ష్యాలకు.. ప్రకృతి, భౌగోళిక పరిస్థితులు కూడా తోడైతే ప్రమాదాల పరంపరను ఆపలేము. ఇప్పుడు ఇండోనేషియాది అదే పరిస్థితి.
తాజాగా ఇండోనేషియాలో మరో విమానం నేల కూలింది.. ఆసియాలోనే అత్యంత చెత్త విమానయాన రికార్డును ఆ దేశం మూటగట్టుకొంది. అక్కడి ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రకృతి తోడు కావడంతో ప్రతి ఏటా ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకోవడం.. పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇక్కడ 1945 నుంచి 104 ప్రమాదాలు జరగ్గా.. 1300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ డేటా చెబుతోంది. ఆసియాలోనే ఇది అత్యంత ప్రమాదకరమైన విమానయాన రికార్డు.
వెంటాడుతున్న గతం..
ఆ దేశం గతంలో విమానయాన పరిశ్రమను నిర్లక్ష్యం చేసిన ఫలితం అనుభవిస్తోంది. చాలాకాలం నియంతృత్వం తర్వాత 1990లలో ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థను పెట్టుబడుల కోసం తెరిచింది. దీంతో వైమానిక పరిశ్రమలో బాగానే పెట్టుబడులు వచ్చాయి. ఆ సమయంలో నియమనిబంధనల విషయంలో అప్రమత్తంగా లేదు. దీనికితోడు విమానయానాన్ని నిర్లక్ష్యం చేసింది. దేశం మొత్తం దీవులు ఉండటంతో చౌక విమానయానానికి ఇది అనుకూలించింది. ఫలితంగా చాలా చోట్ల భద్రతా ఏర్పాట్లు కూడా కరవయ్యాయి. దీంతో అమెరికా.. ఇండోనేషియా విమానయాన సంస్థలను 2007-16 వరకు నిషేధించింది. శిక్షణ లోపం, రికార్డుల నిర్వహణ లేమి, సాంకేతిక నైపుణ్యాల కొరత, తనిఖీల వ్యవస్థలో లోపాలే దీనికి ప్రధాన కారణం. ఐరోపా సంఘం కూడా 2007-18 వరకు నిషేధించింది. దీంతో ఇండోనేషియా చాలా లోపాలను సరిదిద్దుకొంది. ఆ తర్వాత 2016లో అమెరికా నిషేధం తొలగించింది.
27ఏళ్ల నాటి విమానం..
తాజాగా శ్రీవిజయ సంస్థ బోయింగ్ 737-500 మోడల్ విమానం ప్రమాదానికి గురైంది. వాస్తవానికి బోయింగ్లో 737 మోడల్ చాలా విజయవంతమైంది. 1967లో తొలిసారి గాల్లోకి ఎగిరిన 737 మోడల్లో 300,400,మ్యాక్స్ వేరియంట్లు ఉన్నాయి. వీటిల్లో మ్యాక్స్ వేరియంట్ ప్రమాదాలు(లయన్ ఎయిర్, ఇథోపియా ఎయిర్) బోయింగ్ను ఆర్థికంగా కుదిపేశాయి. తాజాగా ప్రమాదానికి గురైన 500 వేరియంట్ విమానం దాదాపు 27ఏళ్ల నుంచి సర్వీసులో ఉంది. ఇది శ్రీవిజయ సంస్థ చేతికి వచ్చే సమయానికే అమెరికాలోని కాంటినెంటల్ ఎయిర్కు సేవలు అందించింది. విమానయాన రంగంలో 25ఏళ్లు దాటిన విమానాలను మార్చేస్తారు. కానీ, ఇక్కడ అలా జరగలేదు. కాకపోతే శ్రీవిజయ సంస్థకు విమాన ప్రమాద రికార్డు తక్కువగా ఉంది. గత 17ఏళ్లలో ప్రాణనష్టంలేని నాలుగు స్వల్ప ప్రమాదాలు జరిగాయి. బోయింగ్కు చెందిన 500 మోడల్ విమానాలు మాత్రం 8 భారీ ప్రమాదాలకు గురయ్యాయి.
భౌగోళిక కారణాలు కూడా..
భూమిపై ఉన్న అతిపెద్ద దీవుల సమూహం ఇండోనేషియానే. ఇక అత్యధిక పిడుగుపాటులు, ఉరుములు ఇక్కడే పడ్డాయి. 1988లో బొగోర్ పట్టణంలో 322 రోజులు ఇవి నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఆ బూడిద గాల్లో కొన్ని కిలోమీటర్ల మేరకు వ్యాపిస్తుంది. వీటిని జెట్ ఇంజిన్లు పీల్చుకొంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. 2019లో కూడా ఈ కారణంతో జకార్తా ఎయిర్పోర్టును కొంతకాలం మూసేశారు. ఇక వర్షాలు కూడా ఎక్కువగానే కురుస్తాయి. తాజాగా ప్రమాదానికి గురైన శ్రీవిజయ ఫ్లైట్ 182 కూడా ప్రతికూల వాతావరణంతో గంటన్నర ఆలస్యంగా బయల్దేరింది. ఇలాంటి పరిస్థితుల్లో కాక్పీట్లో వారికి బయట ఏం జరుగుతోందో స్పష్టంగా కనిపించదు. ఇక తాజా ప్రమాదానికి కారణం ఇప్పుడే చెప్పడం తొందరపాటవుతుంది. నిన్న దొరికిన బ్లాక్బాక్స్ వాయిస్ రికార్డలను విశ్లేషించాక నిపుణులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. భారీగా వర్షం పడుతుండటంతో గాల్లో ఏం జరిగిందో మత్స్యకారులు కూడా సరిగా చూడలేదు.
ఇవీ చదవండి
బ్రెజిల్ ప్రయాణికుల్లో మరో కొత్త స్ట్రెయిన్?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటా విజేతగా నిలిస్తే?.. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
భారత్లో ఎత్తయిన ప్రాంతాల్లోని చిన్నారులకు స్టంటింగ్ ముప్పు
వయసుకు తగ్గట్లు శారీరక ఎదుగుదల లోపించే (స్టంటింగ్) ముప్పు భారత్లోని కొండ ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు ఎక్కువని, తాజా అధ్యయనం తేల్చింది. -
దక్షిణాదిలో నీటి సంక్షోభం!
దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17 శాతం మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా బులెటిన్ పేర్కొంది. -
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు
దేశ రాజధాని దిల్లీలోని నగరపాలక సంస్థ (ఎంసీడీ) పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంపై నగరపాలక సంస్థను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలదీసింది. -
భారతీయులకే అమెరికాలో సీఈవో అవకాశం!
అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు హైకోర్టు నిరాకరణ
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ ఆరోపించిన తెలిసిందే. -
కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా
దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
సిసోదియా జ్యుడిషియల్ కస్టడీ 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోదియా, సహ నిందితుడు విజయ్ నాయర్, ఇతరుల జ్యుడిషియల్ కస్టడీని శుక్రవారమిక్కడి న్యాయస్థానం మే ఎనిమిదో తేదీ వరకు పొడిగింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా చెక్ మొహల్లా నౌపొరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.