మంచి చేసేవాడికి బతికుండగానే మంచి జరగాలి
‘మంచి చేసేవాడికి బతికుండగానే మంచి జరగాలి. కష్టపడేవాడికి భూమ్మీదే ఫలితం లభించాలి.. ఇదే టైమ్ బ్యాంకింగ్ సిద్ధాంతం ’ అని అంటున్నారు పూరీ జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్ వేదికగా ఆయన ఎన్నో అంశాల గురించి తన అభిప్రాయాన్ని బహిర్గతం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
‘టైమ్ బ్యాంకింగ్’ గురించి పూరీ ఏమన్నారంటే..!
హైదరాబాద్: ‘మంచి చేసేవాడికి బతికుండగానే మంచి జరగాలి. కష్టపడేవాడికి భూమ్మీదే ఫలితం లభించాలి.. ఇదే టైమ్ బ్యాంకింగ్ సిద్ధాంతం ’ అని అంటున్నారు పూరీ జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్ వేదికగా ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ‘టైమ్ బ్యాంకింగ్’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘దాదాపు 35 సంవత్సరాల క్రితం ఎడ్గర్ఖాన్ అనే వ్యక్తి ‘టైమ్ బ్యాంకింగ్’ కనిపెట్టారు. ఇది డబ్బు మీద కాదు సేవలపై ఆధారపడి పనిచేస్తుంది. మొట్టమొదట స్విట్జర్లాండ్లో వృద్ధుల కోసం దీనిని ప్రారంభించారు. ఇందులో మనం చేయాల్సిన పని ఏమిటంటే.. సేవలు ఇచ్చిపుచ్చుకోవడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో 500 టైమ్ బ్యాంక్లు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలోని మధ్యప్రదేశ్లో త్వరలో ‘టైమ్ బ్యాంకింగ్’ ప్రారంభించనున్నారు. ఒకరికొకరు సాయం చేసుకుంటే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. గడిచిపోతున్న ప్రతి గంటను ఎందుకు వృథా చేయాలి’ అని పూరీ జగన్నాథ్ తెలిపారు.
అనంతరం ఆయన ‘ట్రావెలింగ్’ గురించి స్పందిస్తూ..‘‘ట్రావెలింగ్’ ఒక అద్భుతమైన విషయం. మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే ‘ఐ యామ్ ఏ ట్రావెలర్’ అని చెప్పాలని ఉంది. ప్రపంచం మొత్తాన్ని అన్వేషించాలనుంది. కానీ సంసారం అనే సాగరంలో చిక్కుకున్నాను కాబట్టి కుదరదు. అయినా పర్వాలేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశానికి వెళ్లండి.. తిరిగి రండి. ఒక గ్రూప్తో వెళ్లి గైడ్ వెనకాల తిరిగే వాళ్లని టూరిస్ట్లంటారు. ఇష్టమొచ్చిన ప్రాంతానికి వెళ్లేవాడిని ట్రావెలర్స్ అంటారు. ఈ ప్రపంచం ఒక పెద్ద పుస్తకం. నువ్వు మీ ఊళ్లోనే పుట్టి.. అక్కడే మరణిస్తే నీకు ఒక పేజీ మాత్రమే తెలుసు అని అర్థం. వీలైనన్ని పేజీలు తిరగేయండి. అతి తక్కువ ఖర్చుతో ఎలా ట్రావెల్ చేయాలో ఒకసారి గూగుల్ చేయండి’ అని పూరీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
Prathinidhi 2 Review: నారా రోహిత్ కీలక పాత్రలో నటించిన ‘ప్రతినిధి2’ ప్రేక్షకుల మెప్పించిందా? -
‘సికందర్’ సరసన రష్మిక
త్వరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది అందాల తార రష్మిక. -
రామోజీ ఫిల్మ్ సిటీలో.. కన్నప్ప సెట్లో
మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. -
అంధుడి పాత్రలో సైఫ్ అలీఖాన్?
పాత్ర బాగుంటే అది హీరోనా... విలనా అనేది చూడనంటారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. -
ప్రతినిధి 2 అలరిస్తుంది.. ఆలోచింపజేస్తుంది
‘‘ప్రస్తుత భారతదేశ రాజకీయాల్ని ప్రతిబింబించే చిత్రం ‘ప్రతినిధి 2’. ఇది ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీకో మేలు చేసేలా ఉండదు. -
మళ్లీ జాలీగా వచ్చేసింది పుష్ప
బాలీవుడ్లో నవ్వులు పూయించిన చిత్రాలు ఎన్నో. అందులో ‘జాలీ ఎల్ఎల్బీ’ ఫ్రాంచైజీ సినిమాలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు. -
మాయావన్లో పోరు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘మాయావన్’. -
మరో కొత్త కథతో నయన్ సిద్ధం!
గతేడాది ‘జవాన్’తో సినీప్రియుల్ని మెప్పించిన అగ్రకథానాయిక నయనతార.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. -
‘మాత్రు’.. ఓ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం
సుగి విజయ్, రూపాలి భూషణ్ జంటగా... జాన్ జక్కీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాత్రు’. -
భారతీయ పాటలకు లాస్ ఏంజెలిస్లో ఆస్కార్ గౌరవం
ఎన్నో ఏళ్లుగా కలగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ పురస్కారాన్ని అందుకొని.. భారతీయ సినిమా గొప్పతనాన్ని ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలబెట్టింది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం. -
మరోసారి వాయిదా
విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. -
భయ్యాజీ ప్రతీకారం
‘భయ్యాజీ’.. ఎంతో ప్రేమగా చూసుకునే తన తమ్ముడిని చంపిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ సోదరుడు చేస్తున్న పోరాటం ఆధారంగా రూపొందిన చిత్రమిది. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
నౌక స్వాధీనం ఘటన.. భారత నావికుల్లో ఐదుగురికి ఇరాన్ విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!