నటుడి మృతి.. పిల్లల్ని చదివిస్తానన్న హీరో

హాస్యనటుడు వడివేలు బాలాజీ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. కోలీవుడ్‌ సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వడివేలు బాలాజీ భౌతికకాయానికి విజయ్‌ సేతుపతి, రోబో శంకర్‌, దివ్య దర్శిణి తదితరులు నివాళులర్పించారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు.....

Published : 12 Sep 2020 02:10 IST

నెట్టింట్లో ప్రశంసలు

చెన్నై: హాస్యనటుడు వడివేలు బాలాజీ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. కోలీవుడ్‌ సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వడివేలు బాలాజీ భౌతికకాయానికి విజయ్‌ సేతుపతి, రోబో శంకర్‌, దివ్య దర్శిణి తదితరులు నివాళులర్పించారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు కొంత ఆర్థిక సాయం చేసినట్లు తెలిసింది. కాగా వడివేలు బాలాజీ ఇద్దరు పిల్లల్ని చదివించేందుకు కథానాయకుడు శివ కార్తికేయన్‌ ముందుకొచ్చారు. ఆయన ఇద్దరు పిల్లల చదువుకు అయ్యే ఖర్చు భరిస్తానని మాటిచ్చారు. దీంతో హీరో మంచితనాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

మదురైకి చెందిన బాలాజీ మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించారు. ప్రముఖ హాస్యనటుడు వడివేలు ముఖ ఛాయలతో ఉండటంతో.. ఆయన్ను అనుకరిస్తూ బుల్లితెరలో పలు కార్యక్రమాలు చేశారు. తద్వారా మంచి గుర్తింపు సాధించారు. అలా ‘వడివేలు బాలాజీ’గా మారారు. పలు సినిమాల్లోనూ నటించి, అలరించారు. 15 రోజుల క్రితం వడివేలు బాలాజీకి గుండెపోటు రావడంతో పక్షవాతానికి గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించారు. ఆపై ఆర్థిక సమస్య వల్ల ఆయన్ను పలు ఆసుపత్రులకు తిప్పారు. చివరికి ఒమండురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని