Balakrishna: రామోజీఫిల్మ్‌సిటీలో... బాలయ్య ఆటాపాట

బాలకృష్ణ కథానాయకుడిగా... మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ

Updated : 16 May 2022 10:50 IST

బాలకృష్ణ కథానాయకుడిగా... మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సోమవారం నుంచి రామోజీ ఫిల్మ్‌   సిటీలో పాటని తెరకెక్కిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా సెట్స్‌ని తీర్చిదిద్దారు.


మరో కథానాయిక 

చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రుతిహాసన్‌తోపాటు మరో కథానాయిక నటించనుంది. అందుకోసం మలయాళ భామ హనీ రోజ్‌ని ఎంపిక చేశారు. కన్నడ నటుడు దునియా విజయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తుండగా, రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని