Cinema News: బెట్టింగ్ ‘బ్యాచ్’
‘బాహుబలి’, ‘రేసుగుర్రం’ లాంటి చిత్రాల్లో బాల నటుడిగా కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించాడు సాత్విక్ వర్మ. ఇప్పుడతన్ని హీరోగా పరిచయం చేస్తూ.. శివ తెరకెక్కించిన చిత్రం ‘బ్యాచ్’. రమేష్ గనమజ్జి నిర్మాత. నేహా పటాన్ కథానాయిక. ఈ సినిమాని రెండు భాగాలుగా
‘బాహుబలి’, ‘రేసుగుర్రం’ లాంటి చిత్రాల్లో బాల నటుడిగా కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించాడు సాత్విక్ వర్మ. ఇప్పుడతన్ని హీరోగా పరిచయం చేస్తూ.. శివ తెరకెక్కించిన చిత్రం ‘బ్యాచ్’. రమేష్ గనమజ్జి నిర్మాత. నేహా పటాన్ కథానాయిక. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. తొలి భాగాన్ని ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రమిది. బెట్టింగ్ నేపథ్యంలో సాగే కథతో రూపొందింది. రఘు కుంచె సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మా చిత్రం బిజినెస్ అవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి కూర్పు: జెపి, ఛాయాగ్రహణం: వెంకట్ మన్నం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్లో సెట్లోకి
గతేడాది బ్లాక్బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.