Tollywood: పాన్ ఇండియా జోరు.. మెరుస్తోంది హిందీ తారల పేరు
ఓ మోస్తరు నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న సినిమా అయినా సరే... పాన్ ఇండియా హంగులు జోడిస్తున్న సమయమిది. మన చిత్రాలకి మార్కెట్లో ఉన్న డిమాండ్ అలాంటిది. పెద్దగా గుర్తింపు లేని యువ కథానాయకుల సినిమాలు సైతం పాన్ ఇండియా మార్కెట్లో సత్తా చాటుతూ సొమ్ము చేసుకుంటున్నాయి.
తెలుగు అగ్రనటుల చిత్రాల్లో బాలీవుడ్ నటుల సందడి
ఓ మోస్తరు నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న సినిమా అయినా సరే... పాన్ ఇండియా హంగులు జోడిస్తున్న సమయమిది. మన చిత్రాలకి మార్కెట్లో ఉన్న డిమాండ్ అలాంటిది. పెద్దగా గుర్తింపు లేని యువ కథానాయకుల సినిమాలు సైతం పాన్ ఇండియా మార్కెట్లో సత్తా చాటుతూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఇక గుర్తింపున్న అగ్ర తారల సినిమాలైతే సరే సరి! అవి పట్టాలెక్కడానికి ముందే దేశవ్యాప్తంగా మార్కెట్ వర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంటాయి. అందుకే ఆయా సినిమాల బృందాలు మొదట్లోనే ‘ఇది బహు భాషా చిత్రం, పాన్ ఇండియా స్థాయి చిత్రం’ అని చాటుతూ పలు భాషలకి చెందిన నటీనటులు తెరపై కనిపించేలా జాగ్రత్త పడుతుంటారు. తెలుగు సినిమాల్లో హిందీ, తమిళం, మలయాళం, కన్నడ... ఇలా భిన్న భాషలకి చెందిన నటులు సందడి చేస్తున్నారంటే కారణం అదే. ఇప్పుడు కూడా కొన్ని కొత్త చిత్రాల విషయంలో హిందీ తారల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
తెలుగు సినిమాల్లో ఇతర భాషలకి చెందిన నటులు కనిపించడం కొత్తేమీ కాదు. కొత్తదనం కోసం తరచూ హిందీ మొదలుకొని మలయాళం వరకు పలు భాషలకి చెందిన నటుల్ని మన తెరపై చూపించేవారు దర్శకనిర్మాతలు. పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగాక ఆ ఉధృతి మరింతగా పెరిగింది. ముఖ్యంగా హిందీ మార్కెట్లో మన సినిమాలకి ఆదరణ భారీగా పెరిగింది. దాంతో సినిమాలోని ఏదో ఒక బలమైన పాత్ర కోసం హిందీ నటుల్ని ఎంపిక చేసుకోవడం పరిపాటిగా మారింది. కథానాయికలు, ప్రతినాయకులుగా హిందీ తారలే సందడి చేస్తున్నారు ఈమధ్య. ‘పుష్ప’ హిందీ మార్కెట్లో సంచలన విజయం సాధించింది. దాంతో ‘పుష్ప2’ కోసం ఓ ప్రముఖ హిందీ నటుడిని ఎంపిక చేసుకునే ప్రయత్నాల్లో సినిమా వర్గాలు ఉన్నాయనే మాట చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే చిత్రబృందం మాత్రం అధికారికంగా ఏ విషయాన్నీ బయట పెట్టడం లేదు.
బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కన్న కొత్త సినిమాలోనూ బాలీవుడ్ హంగులు కనిపించనున్నాయి. ప్రతినాయకుడు, కథానాయిక పాత్రల కోసం బాలీవుడ్ తారల్నే ఎంపిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు అనిల్. కథానాయికగా సోనాక్షి సిన్హాతోపాటు పలువురు భామలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినిమా పట్టాలెక్కడానికి మరికొంత సమయం ఉంది కాబట్టి నటుల ఎంపికపై కసరత్తులు కొనసాగుతున్నాయి.
ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా విషయంలోనూ బాలీవుడ్ పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం కథానాయికగా మొదట అలియాభట్ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆమె గర్భం దాల్చడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో కథానాయిక కోసం బాలీవుడ్వైపే సినీ వర్గాలు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. హిందీ తారలు సైతం తెలుగు సినిమాల్లో నటించడంపై ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నారు. దాంతో మన దర్శకనిర్మాతల పని మరింత సులభం అవుతోంది. సల్మాన్ఖాన్లాంటి కథానాయకుడు సైతం హాలీవుడ్కి వెళ్లడం కంటే కూడా దక్షిణాది సినిమాల్లో నటించడానికే ఇష్టపడతానని చెబుతున్నారు. మంచి అవకాశం అనిపిస్తే బాలీవుడ్ తారలు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నటించడానికి పచ్చజెండా ఊపుతున్నారు.
పవన్కల్యాణ్ (Pawan kalyan) కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ (Harihara Veeramallu) కోసం ఇప్పటికే బాలీవుడ్ తారలు అర్జున్ రాంపాల్తోపాటు, నర్గీస్ ఫక్రీల్ని ఎంపిక చేసుకుంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా విషయంలో మరో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ పేరు కూడా వినిపిస్తోంది. అర్జున్ రాంపాల్ బదులుగా బాబీ రంగంలోకి దిగుతారా లేక, ఆయనతోపాటు బాబీ కూడా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి