Krishnam Raju: తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: సీఎం కేసీఆర్‌

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం..

Updated : 11 Sep 2022 07:58 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. తన యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో కృష్ణంరాజు కథానాయకుడిగా నటించి విలక్షణ నటనాశైలితో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పారు. లోక్‌సభ సభ్యునిగా, కేంద్రమంత్రిగానూ సేవలందించిన కృష్ణంరాజు మృతి విచారకరమన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరని కేసీఆర్‌ ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని