ఏడుసార్లు వాయిదా... ఇప్పుడు మళ్లీనా?
‘మైదాన్’ వాయిదాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఏడుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం మరోసారి అదే బాటలో వెళుతున్నట్లు సమాచారం.
‘మైదాన్’ వాయిదాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఏడుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం మరోసారి అదే బాటలో వెళుతున్నట్లు సమాచారం. అజయ్ దేవ్గణ్ నటించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కావాలి. కానీ ఇప్పుడు ఆ తేదీన రావడం లేదు. మరో కొత్త డేట్ని చిత్రబృందం ప్రకటించనుందట. ఈ సినిమాలో భారతీయ ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్గా అజయ్ కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ పదేపదే మారుతుండటంతో థియేటర్ల్లోనే వస్తుందా? చివరికి ఓటీటీ బాట పడుతుందా? అనే మాటలు కూడా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఈ సినిమా వాయిదాతో విక్రమ్ భట్ నిర్మిస్తోన్న ‘1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్’ ఆ రోజున విడుదలయ్యే అవకాశం ఉంది.
శత్రువెవరో.. మిత్రుడెవరో?
‘షో’, ‘మిస్సమ్మ’ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు దర్శకుడు నీలకంఠ. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘సర్కిల్’. ఎవరు, ఎప్పుడు, ఎందుకు శత్రువులవుతారో.. అన్నది ఉపశీర్షిక. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్ను హైదరాబాద్లో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ.. ‘‘జీవితం, మరణం, విధి.. ఈ మూడింటి కలయిక గురించి చెప్పే చిత్రమిది. ఇందులో హీరో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఓ సర్కిల్లో చిక్కుకుంటాడు. ఎవరు శత్రువు.. ఎవరు మిత్రుడు అని తెలుసుకోలేని సందిగ్ధంలో పడతాడు. మరి ఆ సమస్యల నుంచి హీరో బయటకు రాగలిగాడా? లేదా? అన్నది చిత్ర కథ. సినిమాలో భావోద్వేగాల్ని చాలా సరికొత్తగా చూపించాం. తన పాత్రలోని ఎమోషన్స్ను సాయి రోనక్ చాలా బాగా చూపించాడు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నాది ఒక ఫొటోగ్రాఫర్ పాత్ర. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు హీరో సాయిరోనక్. ఈ కార్యక్రమంలో బాబా భాస్కర్, శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకి సంగీతం: ఎస్.ఎస్ ప్రశు, ఛాయాగ్రహణం: రంగనాథ్ గోగినేని.
శకుని మామ ఇక లేరు
‘మహాభారతం’ ధారావాహికలో శకుని పాత్రధారి, ప్రముఖ నటుడు గూఫీ పెయింటాల్ (79).. వృద్ధాప్య, హృద్రోగ సంబంధ సమస్యలతో ముంబయిలోని ఓ ఆసుపత్రిలో సోమవారం కన్నుమూశారు. 1970లో తెరగేట్రం చేసిన గూఫీ.. 1988లో బీఆర్ చోప్రా తెరకెక్కించిన ప్రఖ్యాత టెలివిజన్ సిరీస్ ‘మహాభారత్’తో శకుని పాత్రతో వెలుగులోకి వచ్చారు. కళ్లతోనే.. వంచన, క్రూరత్వంలాంటి భావోద్వేగాలను పండించి ఆకట్టుకున్నారు. ‘పరమ్వీర్ చక్ర’, ‘శ్రీకృష్ణ్’, ‘రాధాకృష్ణ్’ ‘సీఐడీ’లు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. గూఫీ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!