రజనీ - అమితాబ్‌.. 32ఏళ్ల విరామం తర్వాత!

వెండితెరపై మరో అపురూప కలయికకు రంగం సిద్ధమవుతోంది. కథానాయకులు రజనీకాంత్‌.. అమితాబ్‌ బచ్చన్‌ దాదాపు 32ఏళ్ల విరామం తర్వాత కలిసి తెర పంచుకోనున్నారు.

Published : 11 Jun 2023 01:38 IST

వెండితెరపై మరో అపురూప కలయికకు రంగం సిద్ధమవుతోంది. కథానాయకులు రజనీకాంత్‌.. అమితాబ్‌ బచ్చన్‌ దాదాపు 32ఏళ్ల విరామం తర్వాత కలిసి తెర పంచుకోనున్నారు. రజనీ 170వ చిత్రంతో ఈ కాంబినేషన్‌ కార్యరూపంలోకి రానుంది. ఇది అమితాబ్‌కు తొలి తమిళ చిత్రం కానుంది. ఈ సినిమాని ‘జై భీమ్‌’ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్‌ తెరకెక్కించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడే ఓ రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కథగా ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలిసింది. ఆ పోలీస్‌ పాత్రను రజనీ పోషించనుండగా.. మరో ముఖ్య పాత్రలో అమితాబ్‌ నటించనున్నారని సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. వచ్చే నెలాఖరున ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. రజనీ - అమితాబ్‌ చివరిగా 1991లో వచ్చిన ‘హమ్‌’ సినిమాలో కలిసి నటించారు. అంతకు ముందు ‘అంధా కానూన్‌’, ‘గెరాఫ్తార్‌’ చిత్రాల్లోనూ తెర పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని