Dhanush: అమరన్‌ దర్శకుడితో..?

గతేడాది ‘కెప్టెన్‌ మిల్లర్‌’తో మంచి విజయాన్ని అందుకున్నారు కథానాయకుడు ధనుష్‌. ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన.. దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు.

Updated : 18 Mar 2024 11:44 IST

తేడాది ‘కెప్టెన్‌ మిల్లర్‌’తో మంచి విజయాన్ని అందుకున్నారు కథానాయకుడు ధనుష్‌. ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన.. దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. త్వరలో నాగార్జునతో కలిసి ‘కుబేర’ చిత్రంతో తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడాయన మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. తాజాగా ధనుష్‌ తన రాబోయే సినిమా కోసం దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామితో చేతులు కలిపినట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఉండనుందట. త్వరలో దీనికి సంబంధించిన విషయాలను అధికారికంగా ప్రకటించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం శివకార్తికేయన్‌ నటిస్తున్న ‘అమరన్‌’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు రాజ్‌కుమార్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని