Mahesh Babu: సంక్రాంతికి... ఆనందంగా!

తాను కథానాయకుడిగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ విడుదల విషయంలో స్పష్టతనిచ్చారు మహేశ్‌బాబు.

Updated : 21 Aug 2023 13:46 IST

తాను కథానాయకుడిగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ విడుదల విషయంలో స్పష్టతనిచ్చారు మహేశ్‌బాబు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘సంక్రాంతికి  సినిమా వస్తుంది. అందరూ ఆనందంగా ఉంటార’ని చెప్పారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరుకారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. చాలా రోజుల కిందటే పట్టాలెక్కిన ఈ సినిమా చిత్రీకరణలో జాప్యం చోటు చేసుకొంటోంది. పలుమార్లు విడుదల తేదీ మారింది. తాజాగా.. ఆ అనుమానాలన్నింటికీ తెరదించుతూ మహేశ్‌బాబు స్పష్టతనిచ్చారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని