Kollywood: మణిరత్నం, శంకర్‌ కాంబోలో నిర్మాణ సంస్థ ప్రారంభం

కరోనా దెబ్బకి ఓ పక్క థియేటర్లు మూతపడటం, మరో పక్క ఓటీటీల జోరు ఊపందుకోవడం.. ఈ కారణాలతో అందరి దృష్టి ఇప్పుడు డిజిటల్‌ మీడియా వైపు మళ్లింది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో ‘నవరస’ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలో అడుగులువేసిన అగ్రదర్శకుడు మణిరత్నం.. మరో బడా దర్శకుడు శంకర్‌తో చేతులు కలిపి ఓ ‘‘రెయిన్‌ ఆన్ ఫిల్మిమ్స్‌’’ అనే కొత్త ప్రొడక్షన్‌ హౌస్‌ని ఏర్పాటు చేసినట్లు బుధవారం ప్రకటించారు.

Published : 25 Aug 2021 23:56 IST

చెన్నై: కరోనా దెబ్బకి ఓ పక్క థియేటర్లు మూతపడటం, మరో పక్క ఓటీటీల జోరు ఊపందుకోవడం.. ఈ కారణాలతో అందరి దృష్టి ఇప్పుడు డిజిటల్‌ మీడియా వైపు మళ్లింది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో ‘నవరస’ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలో అడుగులువేసిన అగ్రదర్శకుడు మణిరత్నం.. మరో బడా దర్శకుడు శంకర్‌తో చేతులు కలిపి ఓ ‘‘రెయిన్‌ ఆన్ ఫిల్మిమ్స్‌’’ అనే కొత్త ప్రొడక్షన్‌ హౌస్‌ని ఏర్పాటు చేసినట్లు బుధవారం ప్రకటించారు. వీరితో పాటు దర్శకులు గౌతమ్‌ మేనన్‌, వెట్రిమారన్, లింగుస్వామి, మిస్కిన్, సిస్, వసంతబాలన్, లోకేష్ కనగరాజ్, బాలాజీ శక్తివేల్, ఆర్.మురుగదాస్... ఇందులో భాగం కానున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘ వివిధ ఓటీటీ వేదికలకు వెబ్‌సిరిస్‌ను నిర్మించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశాం, వెబ్‌సిరీస్‌తో పాటు యాంథలజీలు తీయాలని ఆసక్తి ఉన్న యువ దర్శకులందరికీ ఈ రెయిన్‌ ఆన్‌ ఫిల్మిమ్స్‌ అవకాశం కల్పించనుంది’’ అన్నారు. దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ‘విక్రమ్‌’ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది, అనంతరం ఆయన రూపొందించే చిత్రాన్ని రెయిన్‌ ఆన్‌ ఫిలిమ్స్‌ నిర్మించనుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, సాంకేతిక బృందాల వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని