Rana: ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే అర్థమైంది
‘‘ఈ సినిమా తర్వాత నాతో చాలా మంది చాలా అభిప్రాయాలు వ్యక్తం చేశారు కానీ... అందులో మా నాన్న చెప్పిన మాట నాకు బాగా గుర్తుండిపోతుంది. నాన్న ఏదైనా ఎక్కువగా చెప్పరు. ‘సంతృప్తి
‘‘ఈ సినిమా తర్వాత నాతో చాలా మంది చాలా అభిప్రాయాలు వ్యక్తం చేశారు కానీ... అందులో మా నాన్న చెప్పిన మాట నాకు బాగా గుర్తుండిపోతుంది. నాన్న ఏదైనా ఎక్కువగా చెప్పరు. ‘సంతృప్తి చెందా’ అన్నారు. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ ఈ సినిమాకే చాలా గొప్పగా చెప్పారనిపించింది. తెలుగు పరిశ్రమలోనే ఫిల్మ్ మేకింగ్ చేస్తారని ఓ పంపిణీదారుడు ‘వకీల్సాబ్’ సమయంలో చెప్పారు. అలాంటి విషయాలన్నిటిపైనా నాలో అవగాహన పెంచింది ‘భీమ్లానాయక్’. రెండేళ్లపాటు ఏ సినిమా చేయకుండా గడిపిన నేను ‘విరాటపర్వం’ ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ కోసం చిన్నాన్న వెంకటేష్తో కలిసి 8 గంటల వెబ్ సిరీస్, ‘భీమ్లానాయక్’... ఇలా బోలెడంత పనిచేసినట్టు అనిపించింది. ‘విరాటపర్వం’ విడుదలకి సిద్ధమవుతోంది. ఈ పనులన్నీ పూర్తయ్యాక కొత్త సినిమాలపై నిర్ణయం తీసుకుంటా’’.
‘‘మాస్ సినిమా చేయాలని అందరూ చెబుతుంటే... ఎందుకా? అనుకునేవాణ్ని. మాస్... కమర్షియల్ సినిమా అంటే ఇన్నేళ్ల తర్వాత ‘భీమ్లానాయక్’తో అర్థమైంది. ఇకపై ఈ తరహా ప్రయత్నాలు నేనూ చేస్తా’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి. ఆయన పవన్కల్యాణ్తో కలిసి నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రయాణం గురించి రానా దగ్గుబాటి బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘ఏం చేసినా కొత్తగా ఉండాలనుకునే తత్వం నాది. ఇప్పటిదాకా చూడనిది తెరపై చూడాలనే ఆలోచనతోనే నేను థియేటర్కి వెళుతుంటా. అంతకంటే కొత్తగా నేనేం చేయగలననే ఆలోచనతోనే ఉంటా. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చూశాక ఇది నా జోన్ సినిమానే అనిపించింది. ఇద్దరి వ్యక్తుల మధ్య ఒకే అంశం మీద నడిచే కథ ఇది. తెలుగులో రీమేక్ చేస్తున్నారన్నప్పుడు, అదీ పవన్కల్యాణ్లాంటి ఓ పెద్ద స్టార్ వచ్చి ఇలాంటి జోనర్ ప్రయత్నిస్తున్నారని తెలిసినప్పుడు చాలా ఆత్రుతగా అనిపించింది. అవకాశం నా దగ్గరికి రాగానే డానీ పాత్రకి ఎవర్నీ అనుకోకపోతే నేనే చేస్తానని చెప్పా. ‘ఐరన్ మేన్’ సినిమాలో రాబర్ట్ డౌనీ పాత్రంటే నాకు చాలా ఇష్టం. అందులో ఆ పాత్ర నచ్చని పనులన్నీ చేస్తుంటుంది, కానీ అవి మనకు బాగా నచ్చుతుంటాయి. ఆ పాత్రకీ, డానీ పాత్రకీ పోలికలు కనిపించాయి. ఒక సినిమాని రీమేక్ చేస్తున్నప్పుడు దాని వెనక చాలా వ్యవహారాలు ఉంటాయి. మా చిన్నాన్న వెంకటేష్ చాలా రీమేక్లు చేశారు. మార్పులు, చేర్పుల విషయంలో ఎలా మాట్లాడుకుంటుంటారో నేను వినేవాణ్ని. మాతృకలో ఉన్న భావోద్వేగాలు ఏమాత్రం పోకుండా మన వాళ్లకి నచ్చేలా ఈ సినిమాని రచించారు. కొన్ని సన్నివేశాల్ని ఒరిజినల్ని మరిచిపోయేంతగా రాశారు. దానికి తగ్గట్టే దర్శకుడు సాగర్ కె. చంద్ర తెరకెక్కించారు’’.
* ‘‘కేరళ సంస్కృతితో పోలిస్తే మన భాష, మన అభిరుచులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అక్కడ ఒక చిన్న విషయాన్ని చాలా సుదీర్ఘమైన మాటలతో చెబుతున్నట్టు అనిపిస్తుంది. మనం ఒకట్రెండు మాటలతో ఆ భావాల్ని చెప్పేస్తుంటాం. మూడు గంటలు నిడివి ఉన్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాని మన నేపథ్యానికి తగ్గట్టుగా మార్చిన విధానం చాలా బాగుంది. ప్రతి సినిమా నుంచీ నేను ఎంతో కొంత నేర్చుకుంటా. త్రివిక్రమ్ నుంచి చాలా నేర్చుకున్నా. పవన్ కల్యాణ్తో ఈ సినిమాకి ముందు పెద్దగా పరిచయం లేదు, ఆయన్ని కలిసిందీ తక్కువే. సెట్కి వెళ్లాక మరో కొత్త పవన్కల్యాణ్ కనిపించారు. ఆయన చెప్పే ప్రతీ మాట నిజాయతీగా ఉంటుంది. ఈ సినిమా ప్రయాణంలో నేను ఆయనతో బాగా కలిసిపోయా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్లో సెట్లోకి
గతేడాది బ్లాక్బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో