Shahrukh khan: ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న షారుక్‌

బాలీవుడ్‌ బాద్‌షా అభిమానులకు ఓ గుడ్‌న్యూస్‌. త్వరలోనే ఆయన ఓటీటీలో అడుగుపెట్టనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన తోటి నటులు.. అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగణ్‌, సైఫ్‌ అలీఖాన్‌, సంజయ్‌ దత్‌.. ఈ నలుగురు డిస్నీ హాట్‌స్టార్‌ ద్వారా ఓటీటీలోకి అడుగుపెట్టనున్నారు. వారిలాగే షారుఖ్‌ సైతం ఓటీటీలో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారట. ఈ విషయంపై స్పందించిన బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు కరణ్‌జోహార్‌.. షారుక్‌ సైతం ఓటీటీ తెరంగ్రేటం మిస్‌ అవుతానేమో

Published : 11 Sep 2021 21:52 IST

  

ముంబయి: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ అభిమానులకు ఓ గుడ్‌న్యూస్‌. త్వరలోనే ఆయన ఓటీటీలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ ద్వారా హింట్‌ ఇచ్చారు. ఇప్పటికే ఆయన తోటి నటీనటులు.. అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగణ్‌, సైఫ్‌ అలీఖాన్‌, సంజయ్‌ దత్‌ డిస్నీ హాట్‌స్టార్‌ ద్వారా ఓటీటీలోకి అడుగుపెట్టనున్నారు. వారిలాగే షారుక్‌ సైతం ఓటీటీలో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారట.
అయితే షారుఖ్‌ ఓటీటీలో కనిపిస్తారన్న సమాచారం అందినప్పటికీ.. అది వెబ్‌సిరీస్ లేదా పూర్తిస్థాయి చిత్రామా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. దక్షిణాది తార నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక దీపిక పదుకొణెతో కలిసి నటించిన పఠాన్‌ విడుదలకు సిద్ధంగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని