Nayanthara: విఘ్నేశ్.. నయన్తో జాగ్రత్తగా ఉండు: షారుఖ్ సూచన
‘జవాన్’ (Jawan) ట్రైలర్ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసిన విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)కు ఓ సలహా ఇచ్చారు నటుడు షారుఖ్ (Shah rukh).
ముంబయి: నయనతార (Nayanthara) - విఘ్నేశ్ శివన్(Vignesh Shivan)ని ఉద్దేశిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan). నయన్తో జాగ్రత్తగా ఉండు.. కొట్టడంలో ఆమె కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నారంటూ విఘ్నేశ్కు ఆయన సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. అయితే, ఆయన ఈ ట్వీట్ చేయడానికి కారణం ఏమిటంటే..
షారుఖ్ నటించిన ‘జవాన్’ (Jawan) ట్రైలర్పై విఘ్నేశ్ శివన్ ఆనందం వ్యక్తం చేశారు. వీడియో తనకెంతో నచ్చిందని ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘ఇలాంటి బిగ్గెస్ట్ చిత్రంతో అట్లీ బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నందుకు గర్వంగా ఉంది. ట్రైలర్ అంతర్జాతీయ స్థాయిలో ఉంది. షారుఖ్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టాలనే నా సతీమణి నయన్ కల నెరవేరింది. టీమ్ మొత్తానికి నా అభినందనలు’’ అని విఘ్నేశ్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.
దీనిపై షారుఖ్ స్పందిస్తూ.. ‘‘విఘ్నేశ్.. మా సినిమాపై మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నయన్ అద్భుతమైన వ్యక్తి. మీకు ఇప్పటికే ఈ విషయం తెలుసు కదా..!! ఇటీవల ఆమె కొన్ని కీలకమైన పంచ్లు నేర్చుకున్నారు. కాబట్టి జాగ్రత్త’’ అని సరదాగా వ్యాఖ్యానించారు.
మరోవైపు, సల్మాన్ఖాన్ (Salman Khan) సైతం ట్రైలర్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ‘‘పఠాన్’.. ‘జవాన్’గా మారారు. అత్యద్భుతమైన ట్రైలర్. నాకెంతో నచ్చేసింది. ఇలాంటి చిత్రాలను మనం తప్పకుండా థియేటర్లలోనే చూడాలి. ఫస్ట్ డే నేను ఈ సినిమా చూస్తా’’ అని పేర్కొన్నారు.
‘పఠాన్’ (Pathaan) తర్వాత షారుఖ్ నటిస్తోన్న చిత్రం ‘జవాన్’. అట్లీ దర్శకుడు. నయనతార కథానాయిక. విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. దీంతో, షారుఖ్.. చిత్రబృందాన్ని అభినందిస్తూ వస్తోన్న ట్వీట్స్పై స్పందిస్తున్నారు. అలాగే, తమ సినిమా కోసం పనిచేసిన కీలక సభ్యులను పేరు పేరునా మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
సోషల్మీడియా వేదికగా సినీతారలు పంచుకున్న తాజా అప్డేట్లు మీకోసం.. -
ఆ సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగాను: రిచా చద్దా
‘హీరామండి’లో ఒక సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగినట్లు రిచా చద్దా తెలిపారు. -
నాకు కాబోయే వాడు ఇలా ఉండాలి: కృతి సనన్
తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కృతి సనన్ వివరించారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అందుకే సెల్ఫీ అడిగితే పారిపోతా: ఫహద్ ఫాజిల్
ఎవరైనా సెల్ఫీ అడిగితే తాను పారిపోతానని నటుడు ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. -
‘హీరామండి’ షూటింగ్లో డిప్రెషన్లోకి వెళ్లా: మనీషా కొయిరాల
‘హిరామండి’ షూటింగ్ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లినట్లు మనీషా కొయిరాల తెలిపారు. -
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
విజయ్ దేవరకొండ-రష్మిక జోడి మరోసారి స్క్రీన్పై మెరవనున్నట్లు తెలుస్తోంది. -
27 ఏళ్లలో బాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక
తన తొలి చిత్రం ప్రేక్షకాదరణ పొందని కారణంగా 27 ఏళ్లు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదని జ్యోతిక అన్నారు. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కొత్త ప్రతిభ ఎంతైనా అవసరం: మురళీ మోహన్
చిత్ర పరిశ్రమలోకి కొత్త ప్రతిభ రావాల్సిన అవసరం ఉందని నటుడు మురళీ మోహన్ అన్నారు. -
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమా మే 10న విడుదల కానుంది. -
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. -
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్
మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే, మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తున్నాడని అర్థం చేసుకోండని అంటున్నారు పూరి జగన్నాథ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు.