ఆ రోజుల్ని గుర్తు చేసేలా...
శ్రీరామ్, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఛాయాగ్రాహకుడు ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించారు. అచ్యుత రామారావు.పి, రవితేజ మన్యం
శ్రీరామ్, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఛాయాగ్రాహకుడు ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించారు. అచ్యుత రామారావు.పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్లుక్ని ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘విజయదశమికి మా సినిమా పేరుని ప్రకటించాం. చాలా మంది పేరు బాగుందని మెచ్చుకున్నారు. ప్రేక్షకుల్ని వాళ్ల పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే చిత్రమిది. అవికా, శ్రీరామ్ గుర్తుండిపోయే పాత్రల్లో కనిపిస్తారు. కథ ప్రకారం హైదరాబాద్, చిక్ మంగళూరు, రాజమండ్రి, అమెరికాలో చిత్రీకరణ చేశాం. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. పేరు, సినిమా ఫస్ట్లుక్కి లభిస్తున్న స్పందన ఎంతో సంతోషాన్నిచ్చింది. డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రతి ఒక్కరి జీవితంలో టెన్త్ క్లాస్ అనేది ఒక మలుపు. స్నేహం, ఆకర్షణ, ప్రేమ, జీవిత లక్ష్యాలు, కలలు... అన్నిటికీ పునాది ఇక్కడే పడుతుంది. ప్రతి ఒక్కరికీ టెన్త్ క్లాస్ రోజుల్ని గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునేలా సినిమా ఉంటుంది’’ అన్నారు. శ్రీనివాస్రెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజ, శివ బాలాజీ, మధుమిత, సత్యం రాజేష్, భానుశ్రీ, నాజర్, శివాజీరాజా, రాజశ్రీ నాయర్, సత్యకృష్ణ, రూపలక్ష్మి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: రామారావు, కథనం, సంభాషణలు: శ్రుతిక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. -
నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. -
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..