Love Story: మా ప్రయాణం ఆగిపోతుందనే బాధ కలిగింది: నాగ చైతన్య
దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని, సినిమా విడుదలతో ఆ ప్రయాణం ఆగిపోతుందనే బాధ కలిగిందని నటుడు నాగ చైతన్య అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని, సినిమా విడుదలతో ఆ ప్రయాణం ఆగిపోతుందనే బాధ కలిగిందని నటుడు నాగ చైతన్య అన్నారు. ఆయన హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘లవ్స్టోరి’. సాయి పల్లవి కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసింది.
నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘నా ప్రతి సినిమా విడుదలైన తొలిరోజు ప్రేక్షకుల స్పందన ఏంటి? క్రిటిక్స్ ఏమంటున్నారు?అని తెలుసుకుంటా. వాటినిబట్టి ముందుకెళ్తుంటా. కొవిడ్ కారణంగా కొన్నాళ్లు దీనికి దూరమయ్యా. ఈ నెల 24న ‘లవ్స్టోరి’ విడుదల కావడంతో ఎంతో ఆనందించాను. థియేటర్కి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా థ్యాంక్స్. దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. సినిమా విడుదలతో మా ప్రయాణం ఆగిపోతుందనే బాధ కలిగింది. ఈ జర్నీని ఆపొద్దు సర్!’ అని శేఖర్ కమ్ములని కోరారు.
సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘మా తాతయ్యతో కలిసి ‘అన్నమయ్య’ చిత్రాన్ని సుమారు 100 సార్లు చూశా. సుమన్, నాగార్జున కాంబినేషన్లో వచ్చే ఓ సన్నివేశం చూసి తాత ఏడుస్తుంటే నేను నవ్వేదాన్ని. ఈ పాత్ర గురించి నటిగా మారిన తర్వాత తెలిసింది. ఓ పాత్ర పోషిస్తే అది ప్రేక్షకుల హృదయంలో ఎప్పటికీ నిలిచిపోవాలనే విషయాన్ని నాగార్జున సర్ నుంచే నేర్చుకున్నా. చిత్ర బృందం సమష్టి కృషి వల్లే ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. విజయాన్ని అందించిన ప్రేక్షకులకి ధన్యవాదాలు’ అన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందోనని ప్రీ రిలీజ్ ఈవెంట్లో టెన్షన్ పడ్డాను. సున్నితమైన ఈ ప్రేమకథని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనే భయం ఉండేది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నా. దాదాపు మూడేళ్లు ఈ కథతో ప్రయాణించా. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు రావడం వల్ల ఈ సినిమాకి ఎక్కువ మందికి చేరింది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటి ఈశ్వరీ రావు, నిర్మాత సురేశ్ బాబు, గాయని మంగ్లీ, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. -
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. -
నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. -
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్