MAA Elections: సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్న ప్రకాశ్‌రాజ్‌

‘మా’ ఎన్నికల పోలింగ్‌ కేంద్రానికి ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ వెళ్లారు. మరో నటుడు బెనర్జీతో కలిసి జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌స్కూల్‌కు చేరుకుని

Updated : 18 Oct 2021 13:53 IST

హైదరాబాద్‌: ‘మా’ ఎన్నికల పోలింగ్‌ కేంద్రానికి ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ వెళ్లారు. మరో నటుడు బెనర్జీతో కలిసి జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌స్కూల్‌కు చేరుకుని పోలింగ్‌ రోజు నాటి సీసీ ఫుటేజీని  పరిశీలిస్తున్నారు. ఎన్నికల రోజు అక్రమాలు జరిగాయంటూ ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ సహా ఆయన ప్యానల్‌ ఆరోపణలు చేశారు. ఎన్నికల పోలింగ్‌, ఓట్ల లెక్కింపునకు సంబంధించిన సీసీ ఫుటేజీలు కావాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్‌ జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలీసుల సమక్షంలో సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.

అంతకముందు ప్రకాశ్‌రాజ్‌ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయన్నారు. సీసీ ఫుటేజీ పరిశీలించుకోవచ్చని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పారని.. ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ మాత్రం కోర్టుకు వెళ్లమని సూచించారన్నారు. తమ ఫిర్యాదులపై ఆయన స్పందించడం లేదన్నారు. ‘మా’ ఎన్నికల అధికారితోనే తమకు ప్రధాన సమస్య అని చెప్పారు. ఎన్నికల ఓట్ల లెక్కింపుపై కొన్ని సందేహాలు ఉన్నాయని.. వాటిని నివృత్తి చేసుకోవడానికి పోలింగ్‌ కేంద్రానికి వచ్చినట్లు చెప్పారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని