Valimai: వాడి కోపం ఎలా ఉంటుందో?

అజిత్‌ కథానాయకుడిగా హెచ్‌.వినోద్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘వలిమై’. బోనీ కపూర్‌ నిర్మించారు. హ్యూమా ఖురేషి కథానాయిక. తెలుగు యువ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది. 

Updated : 11 Feb 2022 09:45 IST

అజిత్‌ కథానాయకుడిగా హెచ్‌.వినోద్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘వలిమై’. బోనీ కపూర్‌ నిర్మించారు. హ్యూమా ఖురేషి కథానాయిక. తెలుగు యువ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది.  గురువారం హీరో మహేష్‌బాబు చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. బైక్‌ ఛేజింగ్‌ సన్నివేశాలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా ప్రారంభమైంది. అజిత్‌ సీబీసీఐడీ అధికారిగా శక్తిమంతమైన అవతారంలో కనిపించారు. బైక్‌ రేసింగ్‌ చేస్తూ.. దొంగతనాలకు పాల్పడే ముఠా నాయకుడిగా కార్తి  కేయను చూపించారు. ప్రచార చిత్రాన్ని బట్టి.. రేసింగ్‌తో ముడిపడిన యాక్షన్‌ కథాంశంతో సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్‌లో కనిపించిన రేసింగ్‌ ఎపిసోడ్‌లు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ‘‘పవర్‌ ఉన్నది అవతలి వాడ్ని కాపాడటానికి నాశనం చేయడానికి కాదు’’, ‘‘వాడేంటో.. వాడి పనేంటో.. అని ఉన్న ఒకడు నిధానం కోల్పోతే వాడి కోపం ఎలా ఉంటుందో నీకు చూపిస్తా’’ అంటూ ట్రైలర్‌లో వినిపించిన సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, ఛాయాగ్రహణం: నీరవ్‌ షా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని